ఓటరు జాబితా ఎన్యుమరేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలి: మాజీ ఎంపిటిసి బోయ ఇందిర సంజీవ
ఓటరు జాబితా ఎన్యుమరేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలి: మాజీ ఎంపిటిసి బోయ ఇందిర సంజీవ
K.RAVI
మండలంలో ముమ్మరంగా సాగుతున్న ఓటర్ల నమోదు ప్రక్రియ
పార్టీ నాయకులు, బి ఎల్ ఓ లు సమన్వయంతో పనిచేయాలని పిలుపు
ఇంటింటా నిర్వహిస్తున్న ఓటరు జాబితా ఎన్యుమరేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రజలందరూ పూర్తి స్థాయిలో సహకరించాలని పంతంగి మాజీ ఎంపీటీసీ బోయ ఇందిర సంజీవ కోరారు. మండలంలోని ఓటర్ల నమోదు, సవరణల ప్రక్రియపై ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు.ఈ సందర్భంగా బోయ ఇందిర సంజీవ మాట్లాడుతూ... మండలంలోని అన్ని గ్రామాల పోలింగ్ బూత్లలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామంలో ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు నమోదు అయ్యేలా బాధ్యతగా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.సమన్వయంతోనే ప్రక్రియ విజయవంతం. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అనేది అత్యంత కీలకమైనది. దీనిని విజయవంతం చేయడంలో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలి.ముఖ్యంగా బూత్ స్థాయి అధికారులతో ( బి ఎల్ ఓ ) నిరంతరం సమన్వయం చేసుకుంటూ, క్షేత్రస్థాయిలో ఎలాంటి లోపాలు లేకుండా ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి