మొక్కలు నాటి పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయాలి
మొక్కలు నాటి పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయాలి
K.RAVI
* గాయత్రి పాఠశాలలో వనమహోత్సవం.. భారత్ వికాస్ పరిషత్ కార్యదర్శి యువరాజు
ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి, దానిని బాధ్యతగా సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని భారత్ వికాస్ పరిషత్ కొమురంభీమ్ శాఖ కార్యదర్శి చినుకని యువరాజు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని గుడిమల్కాపురం గ్రామ శివారులో గల శ్రీ గాయత్రి పాఠశాల ఆవరణలో సోమవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా యువరాజు మాట్లాడుతూ.. మొక్కలు మనకు ప్రాణవాయువును, స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడమే కాకుండా వర్షపాతానికి, నీడకు ఎంతో దోహదపడతాయని వివరించారు. పచ్చని భవిష్యత్తుకు చెట్లే మూలాధారమన్నారు. అనంతరం విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేస్తూ.. తాము నాటిన మొక్కలను వృక్షాలుగా పెంచేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ పసుపులేటి నరేంద్ర కృష్ణ, పాఠశాల ఇంచార్జి ఆనంద్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి