Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేపాలలో ఉచితంగా యాంటీ రేబీస్ టీకాలు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 07, 2026 07:43 AM

మొక్కలు నాటి పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయాలి

మొక్కలు నాటి పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయాలి

మొక్కలు నాటి పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయాలి
July 07, 2026 06:08 AM 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* గాయత్రి పాఠశాలలో వనమహోత్సవం.. భారత్ వికాస్ పరిషత్ కార్యదర్శి యువరాజు

ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి, దానిని బాధ్యతగా సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని భారత్ వికాస్ పరిషత్ కొమురంభీమ్ శాఖ కార్యదర్శి చినుకని యువరాజు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని గుడిమల్కాపురం గ్రామ శివారులో గల శ్రీ గాయత్రి పాఠశాల ఆవరణలో సోమవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు.

​ఈ సందర్భంగా యువరాజు మాట్లాడుతూ.. మొక్కలు మనకు ప్రాణవాయువును, స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడమే కాకుండా వర్షపాతానికి, నీడకు ఎంతో దోహదపడతాయని వివరించారు. పచ్చని భవిష్యత్తుకు చెట్లే మూలాధారమన్నారు. అనంతరం విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేస్తూ.. తాము నాటిన మొక్కలను వృక్షాలుగా పెంచేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ పసుపులేటి నరేంద్ర కృష్ణ, పాఠశాల ఇంచార్జి ఆనంద్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News