దుర్వాసన, ఈగలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు. కలెక్టర్కు గ్రామస్తుల వినతిపత్రం
దుర్వాసన, ఈగలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు. కలెక్టర్కు గ్రామస్తుల వినతిపత్రం
Editor Desk
జర్పుల తండాలో కోళ్ల ఫారం తొలగించాలి
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం జర్పుల తండా గ్రామపంచాయతీ సమీపంలో ఉన్న కోళ్ల ఫారాన్ని వెంటనే తొలగించాలని గ్రామ సర్పంచి రామ్లాల్ నాయక్, గ్రామ పెద్దలు జిల్లా కలెక్టర్కు సోమవారం వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామానికి అత్యంత సమీపంలో అక్రమంగా ఏర్పాటు చేసిన కోళ్ల ఫారం వల్ల తీవ్రమైన దుర్వాసన, ఈగల సమస్య నెలకొన్నదని తెలిపారు. దీంతో గ్రామంలో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, చిన్నారులు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
భోజనం చేసే సమయంలో ఆహారంపై ఈగలు వాలడంతో పాటు చిన్నపిల్లలకు వాంతులు, విరేచనాలు వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామ సమీపంలోని కోళ్ల ఫారాన్ని వెంటనే తొలగించి తమకు న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు.
వినతిపత్రం సమర్పించిన వారిలో జైపాల్, శంకర్, రాజు, రమేష్, సురేష్, సతీష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి