PRINT TIME: July 06, 2026 07:58 PM
ఇంటెన్సివ్ కార్యక్రమాన్ని పరిశీలించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప
ఇంటెన్సివ్ కార్యక్రమాన్ని పరిశీలించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప
July 06, 2026 06:31 PM
1 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
శ్రీ సత్యసాయి జిల్లా, పెనుగొండ నియోజకవర్గం, పరిగి పట్టణంలోని రెండవ సచివాలయం పరిధిలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ కార్యక్రమం నిర్వహణను తెలుగు దేశం పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప పరిశీలించారు.ఈ సందర్భంగా కార్యక్రమం అమలు తీరును, ఇంటింటికీ జరుగుతున్న వివరాల సేకరణను, ప్రజలకు అందుతున్న సేవలను ఆయన పరిశీలించి సంబంధిత సిబ్బందితో మాట్లాడారు. కార్యక్రమం సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించి ప్రతి అర్హుడికి ప్రభుత్వ సేవలు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజలు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని అవసరమైన వివరాలను నమోదు చేయించుకోవాలని హనుమప్ప కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి