Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 11:20 PM

మంత్రాలయంలో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ వర్ధంతి

మంత్రాలయంలో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ వర్ధంతి

మంత్రాలయంలో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ వర్ధంతి
06-07-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మంత్రాలయం: డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ 40వ వర్ధంతి సందర్భంగా సోమవారం మంత్రాలయం పట్టణంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాలకు కుడి కన్ను అయితే, డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ ఎడమ కన్నులాంటి నాయకుడని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, దేశ తొలి ఉప ప్రధానిగా, సామాజిక న్యాయం కోసం కృషి చేసిన మహానేతగా ఆయన సేవలను కొనియాడారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ విశేష కృషి చేశారని అన్నారు.ఆయన ఆశయాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం మంత్రాలయం నియోజకవర్గంలో దళిత, గిరిజనుల రాజకీయ భాగస్వామ్యం, ప్రతినిధిత్వం పెరగాల్సిన అవసరంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ నాయకులు దేవరపాటి అనిల్‌కుమార్, మారెన్న, నాగేంద్ర, టౌన్ అధ్యక్షుడు గోపాల్, మండల అధ్యక్షుడు గాడిమోడీ నరసింహులు, మండల అధికార ప్రతినిధి ఏసేపు, మండల కార్యదర్శి గర్జి ప్రకాష్, కల్లుదేవకుంట గ్రామ అధ్యక్షుడు ప్రభుదాస్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

మంత్రాలయంలో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ వర్ధంతి

Article Image

మంత్రాలయం: డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ 40వ వర్ధంతి సందర్భంగా సోమవారం మంత్రాలయం పట్టణంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాలకు కుడి కన్ను అయితే, డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ ఎడమ కన్నులాంటి నాయకుడని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, దేశ తొలి ఉప ప్రధానిగా, సామాజిక న్యాయం కోసం కృషి చేసిన మహానేతగా ఆయన సేవలను కొనియాడారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ విశేష కృషి చేశారని అన్నారు.ఆయన ఆశయాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం మంత్రాలయం నియోజకవర్గంలో దళిత, గిరిజనుల రాజకీయ భాగస్వామ్యం, ప్రతినిధిత్వం పెరగాల్సిన అవసరంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ నాయకులు దేవరపాటి అనిల్‌కుమార్, మారెన్న, నాగేంద్ర, టౌన్ అధ్యక్షుడు గోపాల్, మండల అధ్యక్షుడు గాడిమోడీ నరసింహులు, మండల అధికార ప్రతినిధి ఏసేపు, మండల కార్యదర్శి గర్జి ప్రకాష్, కల్లుదేవకుంట గ్రామ అధ్యక్షుడు ప్రభుదాస్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News