మంత్రాలయంలో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ వర్ధంతి
మంత్రాలయంలో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ వర్ధంతి
Editor Desk
మంత్రాలయం: డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ 40వ వర్ధంతి సందర్భంగా సోమవారం మంత్రాలయం పట్టణంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ విగ్రహానికి జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాలకు కుడి కన్ను అయితే, డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ ఎడమ కన్నులాంటి నాయకుడని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, దేశ తొలి ఉప ప్రధానిగా, సామాజిక న్యాయం కోసం కృషి చేసిన మహానేతగా ఆయన సేవలను కొనియాడారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ విశేష కృషి చేశారని అన్నారు.ఆయన ఆశయాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం మంత్రాలయం నియోజకవర్గంలో దళిత, గిరిజనుల రాజకీయ భాగస్వామ్యం, ప్రతినిధిత్వం పెరగాల్సిన అవసరంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ నాయకులు దేవరపాటి అనిల్కుమార్, మారెన్న, నాగేంద్ర, టౌన్ అధ్యక్షుడు గోపాల్, మండల అధ్యక్షుడు గాడిమోడీ నరసింహులు, మండల అధికార ప్రతినిధి ఏసేపు, మండల కార్యదర్శి గర్జి ప్రకాష్, కల్లుదేవకుంట గ్రామ అధ్యక్షుడు ప్రభుదాస్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి