PRINT TIME: July 06, 2026 04:15 PM
దాతృత్వాన్ని చాటిన హరిహర దంపతులు.. నిత్య అన్నదానానికి లక్ష రూపాయలు
దాతృత్వాన్ని చాటిన హరిహర దంపతులు.. నిత్య అన్నదానానికి లక్ష రూపాయలు
July 06, 2026 01:45 PM
53 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంఘం మండల కేంద్రంలో వెలసిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజూ నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి భక్తులు ఉదారంగా విరాళాలు అందిస్తూ తమ వంతు సహకారం అందిస్తున్నారు.ఈ సందర్భంగా సోమవారం వికారాబాద్ జిల్లా రొంపల్లి గ్రామానికి చెందిన హరిహర దంపతులు నిత్య అన్నదాన ప్రసాదం కోసం రూ.1 లక్షల విరాళాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి శివ రుద్రప్పకు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారి దాతృత్వాన్ని అభినందిస్తూ, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామిని ప్రార్థించారు. అలాగే భక్తులు కూడా తమకు చేతనైనంత మేర అన్నదాన సేవకు సహకరించి ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి