నందిపాడు చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
నందిపాడు చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
Komidala Mahender reddy
కంటైనర్ ఢీకొని దంపతులకు తీవ్ర
గాయాలు.. అద్దంకి–నార్కెట్పల్లి రహదారిపై ట్రాఫిక్ అంతరాయం.
మిర్యాలగూడ, జూలై 5: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని నందిపాడు ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం, టూ వీలర్పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు నందిపాడు చౌరస్తా వద్ద రహదారి దాటుతుండగా వేగంగా వచ్చిన కంటైనర్ వాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మిర్యాలగూడ మండలం ట్యాంకుతండకు చెందిన ధనావత్ సకురు (55), కమ్మిలి (60) తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ సాయంతో క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం కారణంగా అద్దంకి–నార్కెట్పల్లి ప్రధాన రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి