Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రైతులకు ఉచితంగా పత్తి విత్తనాల పంపిణీ నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 04, 2026 10:44 PM

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గ్లాసులు, పండ్లు పంపిణీ

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గ్లాసులు, పండ్లు పంపిణీ

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గ్లాసులు, పండ్లు పంపిణీ
July 04, 2026 08:41 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, ఆరోగ్యానికి మేలు చేసే స్టీల్ లేదా గాజు గ్లాసులను ఉపయోగించాలి


బత్తిని కృష్ణమూర్తి సూర్యాపేట జిల్లా జర్నలిస్టు


సమాజంలో విద్యార్థులకు అవసరమైన సేవలు అందించడంలో ప్రెస్ క్లబ్ ఎప్పుడూ ముందుంటుంది


ప్రెస్ క్లబ్ కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు గడ్డం అంజి


కోదాడ పట్టణంలోని ఆజాద్ నగర్ లో ప్రెస్ క్లబ్ కోదాడ నియోజకవర్గం ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, భవిత కేంద్రం మరియు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉర్దూ మీడియం విద్యార్థులకు శనివారం స్టీల్ గ్లాసులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బత్తిని కృష్ణమూర్తి సూర్యాపేట జిల్లా జర్నలిస్టు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నతనం నుంచే పండ్లు, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, ఆరోగ్యానికి మేలు చేసే స్టీల్ లేదా గాజు గ్లాసులను ఉపయోగించాలని అవగాహన కల్పించారు. ప్రెస్ క్లబ్ కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు గడ్డం అంజి మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులకు అవసరమైన సేవలు అందించడంలో ప్రెస్ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కోదాడ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బాణాల అబ్రహం, ప్రధాన కార్యదర్శి బి నాగరాజు, కోశాధికారి షేక్ నూరుద్దీన్, జగన్, వెంకటేశ్వర్లు, ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News