Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడిలో దొంగతనం.. ఆటోతో సహా దొరికిపోయారు! ఎస్ ఐ ఆర్ ప్రక్రియను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 04, 2026 08:35 PM

అన్నక్యాంటీన్‌లలో భోజన ప్రమాణాలను పక్కాగా పాటించాలి:-జిల్లా కలెక్టర్

అన్నక్యాంటీన్‌లలో భోజన ప్రమాణాలను పక్కాగా పాటించాలి:-జిల్లా కలెక్టర్

అన్నక్యాంటీన్‌లలో భోజన ప్రమాణాలను పక్కాగా పాటించాలి:-జిల్లా కలెక్టర్
July 04, 2026 06:00 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

కదిరి పట్టణ కేంద్రంలోని కాలేజీ సర్కిల్ వద్ద నడుస్తున్న అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్‌లో పేదలకు అందుతున్న అల్పాహారం, భోజన వసతులను, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా ఆహార పదార్థాలను పరిశీలించి, నాణ్యతను పరీక్షించారు. అనంతరం క్యాంటీన్‌కు వచ్చిన లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడి, భోజనం ఎలా ఉంది ,సకాలంలో అందుతోందా, లేదా, అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం ఈ అన్న క్యాంటీన్లను ప్రారంభించిందని, ఇందులో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.క్యాంటీన్ లోపల, వంటగది పరిసర ప్రాంతాలలో పారిశుధ్యం కచ్చితంగా పాటించాలని, ఈ విషయంలో మున్సిపల్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.పేదలకు సరఫరా చేసే భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, మెనూ ప్రకారం అన్ని వంటకాలు రుచికరంగా అందించాలని క్యాంటీన్ నిర్వాహకులను హెచ్చరించారు.క్యాంటీన్ వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వచ్ఛమైన తాగునీటి సదుపాయాన్ని నిరంతరం అందుబాటులో ఉంచాలన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ రెడ్డి శేఖర్, రెవెన్యూ అధికారులు, క్యాంటీన్ నిర్వాహకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News