నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని బీఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన హెడ్మాస్టర్ బాదం బిక్షపతి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై బాదం బిక్షపతిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. బాదం బిక్షపతి తన సుదీర్ఘ సేవా కాలంలో వేలాది మంది విద్యార్థులకు విద్యాబోధన చేసి ఆదర్శ ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారని కొనియాడారు.విద్యా రంగ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, పదవీ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు పాల్గొని బాదం బిక్షపతి సేవలను స్మరించుకున్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి