రికార్డులు, సీసీటీఎన్ఎస్ నిర్వహణ పక్కాగా ఉండాలి
బాధితులతో మర్యాదగా వ్యవహరించి, త్వరితగతిన న్యాయం చేయాలి
సైబర్ నేరాలపై సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలి
యాదాద్రి భువనగిరి జిల్లాలో వృత్తిపరమైన పోలీసింగ్ను బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని జనరల్ డైరీ ఎంట్రీలు, సీసీటిఎన్ఎస్ పనితీరు, వివిధ రికార్డులు, రిజిస్టర్లను ఆయన సమగ్రంగా పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదగా, గౌరవప్రదంగా వ్యవహరించాలని, బాధితుల సమస్యలను ఓర్పుతో విని చట్టప్రకారం వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. నేరాల నియంత్రణకు ముందుజాగ్రత్త చర్యలు కీలకమని, ముఖ్యంగా సైబర్ మోసాలు, నూతన నేరాల తీరుపై సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. సమర్థవంతమైన పోలీసింగ్కు క్రమశిక్షణ, పారదర్శకత, అంకితభావం ప్రాథమిక సూత్రాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, సీఐ మన్మధ కుమార్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి