రామన్నపేట, ఆగస్టు 21 :
పచ్చదనం మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణానికి దోహదపడుతుందని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు అన్నారు.
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో శుక్రవారం వైద్యులు, వైద్య సిబ్బందితో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి స్వచ్ఛమైన ఆక్సిజన్ను అందిస్తాయని, తద్వారా దుమ్ము, కాలుష్యం తగ్గుతాయని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆహ్లాదకరమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి అందించడమే లక్ష్యమన్నారు.
భావితరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా పెంచాలని సిబ్బందికి పిలుపునిచ్చారు.కార్యక్రమంలో డా. సదాఫ్ ఫాతిమా, డా. లావణ్య, డా. జైనబ్ సుల్తానా, నర్సింగ్ సూపరింటెండెంట్ నిర్మల ఆనంద్, హెడ్ నర్స్ సోలి, సిబ్బంది సాయి తేజ, సత్యనారాయణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి