Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సింగిల్‌ విండోల్లో ఎంఆర్‌పీ ధరకే యూరియా అమ్మాలి;తాటికొండ సీతయ్య తరగతి గదిలో గురువులు.. ఉద్యోగంలో మాత్రం అతిథులే! కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 21, 2026 06:26 PM

పచ్చని మొక్కలతో.. ప్రశాంతమైన వాతావరణం. సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు.

పచ్చని మొక్కలతో.. ప్రశాంతమైన వాతావరణం. సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు.

పచ్చని మొక్కలతో.. ప్రశాంతమైన వాతావరణం. సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు.
21-08-2026 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, ఆగస్టు 21 :

పచ్చదనం మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణానికి దోహదపడుతుందని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు అన్నారు.

మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో శుక్రవారం వైద్యులు, వైద్య సిబ్బందితో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కలు కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తాయని, తద్వారా దుమ్ము, కాలుష్యం తగ్గుతాయని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆహ్లాదకరమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి అందించడమే లక్ష్యమన్నారు.

భావితరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా పెంచాలని సిబ్బందికి పిలుపునిచ్చారు.కార్యక్రమంలో డా. సదాఫ్ ఫాతిమా, డా. లావణ్య, డా. జైనబ్ సుల్తానా, నర్సింగ్ సూపరింటెండెంట్ నిర్మల ఆనంద్, హెడ్ నర్స్ సోలి, సిబ్బంది సాయి తేజ, సత్యనారాయణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పచ్చని మొక్కలతో.. ప్రశాంతమైన వాతావరణం. సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు.

Article Image

రామన్నపేట, ఆగస్టు 21 :

పచ్చదనం మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణానికి దోహదపడుతుందని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు అన్నారు.

మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో శుక్రవారం వైద్యులు, వైద్య సిబ్బందితో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కలు కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తాయని, తద్వారా దుమ్ము, కాలుష్యం తగ్గుతాయని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆహ్లాదకరమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి అందించడమే లక్ష్యమన్నారు.

భావితరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా పెంచాలని సిబ్బందికి పిలుపునిచ్చారు.కార్యక్రమంలో డా. సదాఫ్ ఫాతిమా, డా. లావణ్య, డా. జైనబ్ సుల్తానా, నర్సింగ్ సూపరింటెండెంట్ నిర్మల ఆనంద్, హెడ్ నర్స్ సోలి, సిబ్బంది సాయి తేజ, సత్యనారాయణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News