Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తోర్నల్‌లో మొక్కల పంపిణీ కార్యక్రమం.. పర్యావరణ పరిరక్షణకు పిలుపు తరగతి గదిలో గురువులు.. ఉద్యోగంలో మాత్రం అతిథులే! కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 21, 2026 04:21 PM

తోర్నల్‌లో మొక్కల పంపిణీ కార్యక్రమం.. పర్యావరణ పరిరక్షణకు పిలుపు

తోర్నల్‌లో మొక్కల పంపిణీ కార్యక్రమం.. పర్యావరణ పరిరక్షణకు పిలుపు

తోర్నల్‌లో మొక్కల పంపిణీ కార్యక్రమం.. పర్యావరణ పరిరక్షణకు పిలుపు
21-08-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని తోర్నల్ గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేసి, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి కుటుంబం మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. మొక్కలు నాటడం వల్ల భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందుతుందని గ్రామ పెద్దలు తెలిపారు. గ్రామ అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు యువత, గ్రామస్తులు కలిసి ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, యువత, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

తోర్నల్‌లో మొక్కల పంపిణీ కార్యక్రమం.. పర్యావరణ పరిరక్షణకు పిలుపు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని తోర్నల్ గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేసి, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి కుటుంబం మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. మొక్కలు నాటడం వల్ల భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందుతుందని గ్రామ పెద్దలు తెలిపారు. గ్రామ అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు యువత, గ్రామస్తులు కలిసి ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, యువత, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News