ప్రజా సమస్యలే ఇతివృత్తంగా.. కళనే ఆయుధంగా మలచుకుని ప్రజలను చైతన్యపరిచిన ప్రజా కళాకారుడు కామ్రేడ్ కారుపోతుల అంజన్న సేవలు చిరస్మరణీయమని ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ సభ్యుడు గంటెపాక శ్రీకృష్ణ, మండల అధ్యక్షుడు బర్రె మధు అన్నారు. అంజన్న 31వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం కక్కిరేణి గ్రామంలో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలోని అన్యాయాలు, దోపిడీ, అసమానతలకు వ్యతిరేకంగా తన కళారూపాలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన అంజన్న.. ‘కళ కళ కోసం కాదు.. కళ ప్రజల కోసం’ అనే నినాదానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. ప్రజల సమస్యలను తన కళ ద్వారా ప్రతిబింబిస్తూ సమాజ మార్పు కోసం కృషి చేశారని కొనియాడారు. ఆయన జీవితం, పోరాట స్ఫూర్తి నేటి ప్రజా కళాకారులకు ఆదర్శమని పేర్కొన్నారు.
ప్రస్తుత కళాకారులు సైతం ప్రజా సమస్యలను తమ కళారూపాల్లో ప్రతిబింబిస్తూ సమాజ చైతన్యానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ సభ్యుడు మజ్జూరి సాయి, మండల కమిటీ సభ్యులు కానుకుంట్ల ఉప్పలయ్య, మచ్చగిరి, వెంకన్న, లింగస్వామి, చరణ్, లోకేష్, బూడిద ఆది తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి