Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జ్ఞాపకాలను సజీవంగా నిలిపే అద్భుత కళ ఫొటోగ్రఫీ కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 19, 2026 07:58 PM

ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు

ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు

ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు
19-08-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ కేంద్రంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ గర్భిణీ స్త్రీల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. స్కానింగ్, వైద్యుల సలహాల కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణీల వద్దకు వెళ్లి వారికి ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కూర్చోవడానికి సరైన సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని గర్భిణీలు తెలపడంతో డాక్టర్ రమేష్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి కుర్చీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే ఆసుపత్రికి వచ్చే గర్భిణీలతో పాటు ప్రతి రోగి పట్ల వైద్యులు, సిబ్బంది మర్యాదగా, బాధ్యతగా వ్యవహరించాలని, అవసరమైన వైద్య పరీక్షలు, స్కానింగ్, వైద్యుల సలహాలను సకాలంలో అందించాలని సూచించారు.ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే ప్రతి పేషెంట్‌కు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలను మరింత అభివృద్ధి చేయడంతో పాటు రోగులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యంగా గర్భిణీలు, వృద్ధులు, చిన్నపిల్లలు, అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి రోగి సమస్యను సానుకూలంగా విని, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా వైద్య సేవలను మెరుగుపరుస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండే ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని డాక్టర్ రమేష్ స్పష్టం చేశారు.

Sthanikam

ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు

Article Image

నారాయణఖేడ్ మున్సిపల్ కేంద్రంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ గర్భిణీ స్త్రీల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. స్కానింగ్, వైద్యుల సలహాల కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణీల వద్దకు వెళ్లి వారికి ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కూర్చోవడానికి సరైన సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని గర్భిణీలు తెలపడంతో డాక్టర్ రమేష్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి కుర్చీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే ఆసుపత్రికి వచ్చే గర్భిణీలతో పాటు ప్రతి రోగి పట్ల వైద్యులు, సిబ్బంది మర్యాదగా, బాధ్యతగా వ్యవహరించాలని, అవసరమైన వైద్య పరీక్షలు, స్కానింగ్, వైద్యుల సలహాలను సకాలంలో అందించాలని సూచించారు.ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే ప్రతి పేషెంట్‌కు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలను మరింత అభివృద్ధి చేయడంతో పాటు రోగులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యంగా గర్భిణీలు, వృద్ధులు, చిన్నపిల్లలు, అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి రోగి సమస్యను సానుకూలంగా విని, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా వైద్య సేవలను మెరుగుపరుస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండే ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని డాక్టర్ రమేష్ స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News