ఉపాధి హామీ పథకంలో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ రామన్నపేట మండలానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు బుధవారం ఎంపీడీవో, ఏపీవోలకు వినతిపత్రం అందజేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిర్ణమ్మల గ్రామానికి చెందిన బాలరాజు, రామన్నపేటకు చెందిన చెరుకు సత్యనారాయణ గతంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేశారు. 2006 నుంచి 2019 వరకు సేవలందించిన తమను జాబ్కార్డుల్లో పనిదినాలు 10 శాతం కంటే తక్కువగా ఉండటంతో విధుల నుంచి తొలగించినట్లు వారు తెలిపారు. వి బి జి రాంమ్ జి ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ మేరకు రామన్నపేట ఎంపీడీవో ఏ. రాములు, ఏపీవో వెంకన్నకు వినతిపత్రం అందజేశారు. గతంలో తాము అందించిన సేవలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి