Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 18, 2026 09:22 PM

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి
18-08-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపల్ ఛైర్మన్‌కు ఐఎన్‌టీయూసీ వినతి

చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఐఎన్‌టీయూసీ మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల గణేష్ కుమార్ కోరారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపల్ ఛైర్మన్ మొగుదల పావని రమేష్ గౌడ్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జాతీయ రహదారి విస్తరణ పనుల కారణంగా చౌటుప్పల్‌లో ఎంతోమంది చిరు వ్యాపారులు, కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను వేగవంతం చేసి, బాధితులైన చిరు కార్మికులకు షాపులు కేటాయించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మున్సిపల్ ఛైర్మన్ పావని రమేష్ సానుకూలంగా స్పందించారు. స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన నిధులు మంజూరు చేయించి మార్కెట్ నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ నాయకులు కొలని వినయ్, అతిసేరు బాలరాజు, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి

Article Image

చౌటుప్పల్ మున్సిపల్ ఛైర్మన్‌కు ఐఎన్‌టీయూసీ వినతి

చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఐఎన్‌టీయూసీ మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల గణేష్ కుమార్ కోరారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపల్ ఛైర్మన్ మొగుదల పావని రమేష్ గౌడ్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జాతీయ రహదారి విస్తరణ పనుల కారణంగా చౌటుప్పల్‌లో ఎంతోమంది చిరు వ్యాపారులు, కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను వేగవంతం చేసి, బాధితులైన చిరు కార్మికులకు షాపులు కేటాయించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మున్సిపల్ ఛైర్మన్ పావని రమేష్ సానుకూలంగా స్పందించారు. స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన నిధులు మంజూరు చేయించి మార్కెట్ నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ నాయకులు కొలని వినయ్, అతిసేరు బాలరాజు, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News