చౌటుప్పల్ మున్సిపల్ ఛైర్మన్కు ఐఎన్టీయూసీ వినతి
చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఐఎన్టీయూసీ మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల గణేష్ కుమార్ కోరారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపల్ ఛైర్మన్ మొగుదల పావని రమేష్ గౌడ్ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జాతీయ రహదారి విస్తరణ పనుల కారణంగా చౌటుప్పల్లో ఎంతోమంది చిరు వ్యాపారులు, కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను వేగవంతం చేసి, బాధితులైన చిరు కార్మికులకు షాపులు కేటాయించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మున్సిపల్ ఛైర్మన్ పావని రమేష్ సానుకూలంగా స్పందించారు. స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన నిధులు మంజూరు చేయించి మార్కెట్ నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు కొలని వినయ్, అతిసేరు బాలరాజు, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి