Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 18, 2026 06:26 PM

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొనసాగుతున్నాయి:మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొనసాగుతున్నాయి:మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొనసాగుతున్నాయి:మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు  అస్మా
18-08-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

న్యాల్‌కల్ మండల పరిధిలోని మెటల్‌కుంట గ్రామంలో నిర్వహించిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై కొందరు చేస్తున్న దుష్ప్రచారం నిరాధారమని అన్నారు. పథకాలను ప్రభుత్వం నిలిపివేస్తోందంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం సరికాదని, ఇతర పార్టీ నాయకులు కల్లబొల్లి మాటలు మానుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం ఈ పథకాలకు చట్టబద్ధమైన భద్రత కల్పించకపోవడం వల్లే ప్రస్తుతం కొన్ని న్యాయపరమైన సమస్యలు తలెత్తాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. మహిళా కాంగ్రెస్‌ను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు పూలమ్మ, ఇందిరమ్మ, బుజ్జమ్మ, బేగం, శశికళ, సత్యమ్మ, మధురవేణి, ఆశమ్మ, శివమ్మ, భీమమ్మ, రషీద, శేషమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొనసాగుతున్నాయి:మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా

Article Image

న్యాల్‌కల్ మండల పరిధిలోని మెటల్‌కుంట గ్రామంలో నిర్వహించిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై కొందరు చేస్తున్న దుష్ప్రచారం నిరాధారమని అన్నారు. పథకాలను ప్రభుత్వం నిలిపివేస్తోందంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం సరికాదని, ఇతర పార్టీ నాయకులు కల్లబొల్లి మాటలు మానుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం ఈ పథకాలకు చట్టబద్ధమైన భద్రత కల్పించకపోవడం వల్లే ప్రస్తుతం కొన్ని న్యాయపరమైన సమస్యలు తలెత్తాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. మహిళా కాంగ్రెస్‌ను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు పూలమ్మ, ఇందిరమ్మ, బుజ్జమ్మ, బేగం, శశికళ, సత్యమ్మ, మధురవేణి, ఆశమ్మ, శివమ్మ, భీమమ్మ, రషీద, శేషమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News