న్యాల్కల్ మండల పరిధిలోని మెటల్కుంట గ్రామంలో నిర్వహించిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై కొందరు చేస్తున్న దుష్ప్రచారం నిరాధారమని అన్నారు. పథకాలను ప్రభుత్వం నిలిపివేస్తోందంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం సరికాదని, ఇతర పార్టీ నాయకులు కల్లబొల్లి మాటలు మానుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం ఈ పథకాలకు చట్టబద్ధమైన భద్రత కల్పించకపోవడం వల్లే ప్రస్తుతం కొన్ని న్యాయపరమైన సమస్యలు తలెత్తాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. మహిళా కాంగ్రెస్ను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు పూలమ్మ, ఇందిరమ్మ, బుజ్జమ్మ, బేగం, శశికళ, సత్యమ్మ, మధురవేణి, ఆశమ్మ, శివమ్మ, భీమమ్మ, రషీద, శేషమ్మ తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొనసాగుతున్నాయి:మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొనసాగుతున్నాయి:మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా
Krishna
న్యాల్కల్ మండల పరిధిలోని మెటల్కుంట గ్రామంలో నిర్వహించిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై కొందరు చేస్తున్న దుష్ప్రచారం నిరాధారమని అన్నారు. పథకాలను ప్రభుత్వం నిలిపివేస్తోందంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం సరికాదని, ఇతర పార్టీ నాయకులు కల్లబొల్లి మాటలు మానుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం ఈ పథకాలకు చట్టబద్ధమైన భద్రత కల్పించకపోవడం వల్లే ప్రస్తుతం కొన్ని న్యాయపరమైన సమస్యలు తలెత్తాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. మహిళా కాంగ్రెస్ను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు పూలమ్మ, ఇందిరమ్మ, బుజ్జమ్మ, బేగం, శశికళ, సత్యమ్మ, మధురవేణి, ఆశమ్మ, శివమ్మ, భీమమ్మ, రషీద, శేషమ్మ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి