యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామ సమగ్ర అభివృద్ధికి దివీస్ ల్యాబొరేటరీస్ సంస్థ సానుకూలంగా స్పందించింది. తమ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల ద్వారా గ్రామంలో పలు అభివృద్ధి పనులను చేపడతామని యాజమాన్యం హామీ ఇచ్చింది. గ్రామంలో అత్యవసరంగా చేపట్టాల్సిన మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులపై గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యుల బృందం దివీస్ యాజమాన్యాన్ని నేరుగా కలసి వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, సురక్షిత తాగునీటి కోసం వాటర్ ఫిల్టర్ల ఏర్పాటు. ఎఎమ్ఆర్ కాలనీలో కమ్యూనిటీ హాల్, గ్రామీణుల ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్ అందుబాటులోకి తేవడం. ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మతులు, పెయింటింగ్ పనులు చేపట్టడం. రవాణా సౌకర్యం కోసం నక్కలగూడెం రోడ్డు, గోకారం రోడ్డు ప్రాంతాలలో కల్వర్టుల నిర్మాణం. గ్రామ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తిపై దివీస్ ల్యాబొరేటరీస్ ప్రతినిధి సుధాకర్ సానుకూలంగా స్పందించారు. నేలపట్ల గ్రామ అభివృద్ధికి కంపెనీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని, త్వరలోనే ఈ పనులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నేలపట్ల గ్రామ ఉపసర్పంచ్ చిన్నం బాలరాజు, వార్డు సభ్యులు పార అనసూయ శ్యామ్, బుట్టి స్రవంతి బాలరాజు, డబ్బటి ఉపేందర్, కత్తుల సాయి, గుర్రం ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దివీస్ ల్యాబొరేటరీస్ సీఎస్ఆర్ నిధులతో నేలపట్ల సమగ్రాభివృద్ధి: యాజమాన్యం హామీ
దివీస్ ల్యాబొరేటరీస్ సీఎస్ఆర్ నిధులతో నేలపట్ల సమగ్రాభివృద్ధి: యాజమాన్యం హామీ
K.RAVI
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామ సమగ్ర అభివృద్ధికి దివీస్ ల్యాబొరేటరీస్ సంస్థ సానుకూలంగా స్పందించింది. తమ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల ద్వారా గ్రామంలో పలు అభివృద్ధి పనులను చేపడతామని యాజమాన్యం హామీ ఇచ్చింది. గ్రామంలో అత్యవసరంగా చేపట్టాల్సిన మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులపై గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యుల బృందం దివీస్ యాజమాన్యాన్ని నేరుగా కలసి వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, సురక్షిత తాగునీటి కోసం వాటర్ ఫిల్టర్ల ఏర్పాటు. ఎఎమ్ఆర్ కాలనీలో కమ్యూనిటీ హాల్, గ్రామీణుల ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్ అందుబాటులోకి తేవడం. ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మతులు, పెయింటింగ్ పనులు చేపట్టడం. రవాణా సౌకర్యం కోసం నక్కలగూడెం రోడ్డు, గోకారం రోడ్డు ప్రాంతాలలో కల్వర్టుల నిర్మాణం. గ్రామ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తిపై దివీస్ ల్యాబొరేటరీస్ ప్రతినిధి సుధాకర్ సానుకూలంగా స్పందించారు. నేలపట్ల గ్రామ అభివృద్ధికి కంపెనీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని, త్వరలోనే ఈ పనులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నేలపట్ల గ్రామ ఉపసర్పంచ్ చిన్నం బాలరాజు, వార్డు సభ్యులు పార అనసూయ శ్యామ్, బుట్టి స్రవంతి బాలరాజు, డబ్బటి ఉపేందర్, కత్తుల సాయి, గుర్రం ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి