Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు దివీస్ ల్యాబొరేటరీస్ సీఎస్ఆర్ నిధులతో నేలపట్ల సమగ్రాభివృద్ధి: యాజమాన్యం హామీ విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 17, 2026 09:08 PM

దివీస్ ల్యాబొరేటరీస్ సీఎస్ఆర్ నిధులతో నేలపట్ల సమగ్రాభివృద్ధి: యాజమాన్యం హామీ

దివీస్ ల్యాబొరేటరీస్ సీఎస్ఆర్ నిధులతో నేలపట్ల సమగ్రాభివృద్ధి: యాజమాన్యం హామీ

దివీస్ ల్యాబొరేటరీస్ సీఎస్ఆర్ నిధులతో నేలపట్ల సమగ్రాభివృద్ధి: యాజమాన్యం హామీ
17-08-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామ సమగ్ర అభివృద్ధికి దివీస్ ల్యాబొరేటరీస్ సంస్థ సానుకూలంగా స్పందించింది. తమ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల ద్వారా గ్రామంలో పలు అభివృద్ధి పనులను చేపడతామని యాజమాన్యం హామీ ఇచ్చింది. ​గ్రామంలో అత్యవసరంగా చేపట్టాల్సిన మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులపై గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యుల బృందం దివీస్ యాజమాన్యాన్ని నేరుగా కలసి వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, సురక్షిత తాగునీటి కోసం వాటర్ ఫిల్టర్ల ఏర్పాటు. ఎఎమ్ఆర్ కాలనీలో కమ్యూనిటీ హాల్, గ్రామీణుల ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్ అందుబాటులోకి తేవడం. ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మతులు, పెయింటింగ్ పనులు చేపట్టడం. రవాణా సౌకర్యం కోసం నక్కలగూడెం రోడ్డు, గోకారం రోడ్డు ప్రాంతాలలో కల్వర్టుల నిర్మాణం. ​గ్రామ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తిపై దివీస్ ల్యాబొరేటరీస్ ప్రతినిధి సుధాకర్ సానుకూలంగా స్పందించారు. నేలపట్ల గ్రామ అభివృద్ధికి కంపెనీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని, త్వరలోనే ఈ పనులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.​ఈ కార్యక్రమంలో నేలపట్ల గ్రామ ఉపసర్పంచ్ చిన్నం బాలరాజు, వార్డు సభ్యులు పార అనసూయ శ్యామ్, బుట్టి స్రవంతి బాలరాజు, డబ్బటి ఉపేందర్, కత్తుల సాయి, గుర్రం ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దివీస్ ల్యాబొరేటరీస్ సీఎస్ఆర్ నిధులతో నేలపట్ల సమగ్రాభివృద్ధి: యాజమాన్యం హామీ

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామ సమగ్ర అభివృద్ధికి దివీస్ ల్యాబొరేటరీస్ సంస్థ సానుకూలంగా స్పందించింది. తమ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల ద్వారా గ్రామంలో పలు అభివృద్ధి పనులను చేపడతామని యాజమాన్యం హామీ ఇచ్చింది. ​గ్రామంలో అత్యవసరంగా చేపట్టాల్సిన మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులపై గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యుల బృందం దివీస్ యాజమాన్యాన్ని నేరుగా కలసి వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, సురక్షిత తాగునీటి కోసం వాటర్ ఫిల్టర్ల ఏర్పాటు. ఎఎమ్ఆర్ కాలనీలో కమ్యూనిటీ హాల్, గ్రామీణుల ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్ అందుబాటులోకి తేవడం. ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మతులు, పెయింటింగ్ పనులు చేపట్టడం. రవాణా సౌకర్యం కోసం నక్కలగూడెం రోడ్డు, గోకారం రోడ్డు ప్రాంతాలలో కల్వర్టుల నిర్మాణం. ​గ్రామ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తిపై దివీస్ ల్యాబొరేటరీస్ ప్రతినిధి సుధాకర్ సానుకూలంగా స్పందించారు. నేలపట్ల గ్రామ అభివృద్ధికి కంపెనీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని, త్వరలోనే ఈ పనులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.​ఈ కార్యక్రమంలో నేలపట్ల గ్రామ ఉపసర్పంచ్ చిన్నం బాలరాజు, వార్డు సభ్యులు పార అనసూయ శ్యామ్, బుట్టి స్రవంతి బాలరాజు, డబ్బటి ఉపేందర్, కత్తుల సాయి, గుర్రం ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News