రామన్నపేట సీనియర్ పాత్రికేయులు ఎం.డి. ఇబ్రహీం మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటని రామన్నపేట ప్రెస్ క్లబ్ సభ్యులు అన్నారు. ఆదివారం స్థానిక సుభాష్ సెంటర్ వద్ద ఇబ్రహీం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ.. ఇబ్రహీం పాత్రికేయ రంగంలో విశేష కృషి చేశారని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తిగా ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అప్పం చెన్నకేశ్వర్, భైరబోయిన రమేష్, బూరుగు వెంకటేశం, లవణం చంద్రశేఖర్, జీనుకల శ్రీను, లవణం ఉపేందర్, బత్తుల గణేష్, నోముల శంకర్, కైరంకొండ సంతోష్, సంగీశెట్టి పాండు, వీరమళ్ల రమేష్ పాల్గొన్నారు. అలాగే వివిధ పార్టీల నాయకులు కూనూరి సాయికుమార్, నకిరేకంటి మొగులయ్య, పోచబోయిన మల్లేశం, బందెల రాములు, సాల్వర్ అశోక్, ఎం.డి. జమీరుద్దీన్, ఎం.డి. అక్రమ్, మొటే రమేష్, బొడ్డు సురేందర్, కందుల హన్మంతు, బొడ్డుపల్లి లింగయ్య, ఇన్నాయత్ బైగ్, పల్లపు రవి, దావునూరి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి