నారాయణపురంలో దొడ్డి కొమరయ్య విగ్రహం వద్ద బీఎస్పీ నిరసన
ఎన్నికల వేళ గొల్ల–కురుమలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అమలు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తీవ్రస్థాయిలో డిమాండ్ చేసింది. ప్రభుత్వం కాలయాపన ధోరణి వీడకపోవడం వల్ల గొల్ల–కురుమ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయని బీఎస్పీ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి ఐతరాజు అభేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని దొడ్డి కొమరయ్య విగ్రహం వద్ద బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెల పెంపకందారులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. హామీల అమలులో జరుగుతున్న జాప్యం వారి జీవనోపాధిపై కోలుకోలేని దెబ్బతీస్తోందని విమర్శించారు. కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా, పెండింగ్లో ఉన్న పథకాలను క్షేత్రస్థాయిలో అమల్లోకి తెచ్చేందుకు స్పష్టమైన కాలపట్టికను (యాక్షన్ ప్లాన్) తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. గొల్ల–కురుమల హక్కులు, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బీఎస్పీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా కార్యదర్శి కత్తుల పరమేష్, మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల గిరి, ఉపాధ్యక్షుడు గొంది గళ్ళ కృష్ణ, గొల్ల–కురుమ సంఘం అధ్యక్షుడు బండారి నరసింహ, నాయకులు వెంకటేష్, శంకర్, రాజు, నరసింహ, మల్లయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి