చిట్యాల, ఆగస్టు 15: చిట్యాల విజన్ ఆంధ్ర రిపోర్టర్ చెన్నోజు చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులు చంద్రశేఖర్ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.పాత్రికేయ వృత్తిలో మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో తనదైన శైలిలో ముందుకు సాగాలని మిత్రులు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా చంద్రశేఖర్కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల ప్రాంతానికి చెందిన పలువురు పాత్రికేయ మిత్రులు, మీడియా ప్రతినిధులు పాల్గొని చంద్రశేఖర్కు శుభాకాంక్షలు అందజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి