కత్తెరతో దాడి.. వెంకటేశ్ (28) మృతి | పరారీలో శివ.. పోలీసుల గాలింపు
చైతన్యపురి: తండ్రి అంత్యక్రియల ఖర్చుల విషయంలో మొదలైన అన్నదమ్ముల మధ్య వివాదం చివరకు హత్యకు దారితీసింది. డబ్బుల విషయమై జరిగిన గొడవలో తమ్ముడు కత్తెరతో అన్నపై దాడి చేయడంతో వెంకటేశ్ (28) అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంపాపేట కుమ్మరిబస్తీలో శనివారం చోటుచేసుకుంది.
తండ్రి అంత్యక్రియల ఖర్చుల్లో తన వాటా ఇవ్వలేదంటూ వెంకటేశ్ తమ్ముడు శివ (26) కొంతకాలంగా అన్నతో గొడవపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో శనివారం మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో శివ కత్తెరతో వెంకటేశ్పై దాడి చేసినట్లు సమాచారం.
తీవ్ర గాయాలతో వెంకటేశ్ మృతి చెందాడు. ఘటన అనంతరం శివ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న సరూర్నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.. హత్యకు దారితీసిన పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి