Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
300 మీటర్ల జాతీయ జెండాతో తైక్వాండో క్రీడాకారుల తిరంగా ర్యాలీ విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 16, 2026 07:54 AM

అంత్యక్రియల ఖర్చులపై అన్నదమ్ముల మధ్య గొడవ.. కత్తెరతో అన్నను చంపిన తమ్ముడు

అంత్యక్రియల ఖర్చులపై అన్నదమ్ముల మధ్య గొడవ.. కత్తెరతో అన్నను చంపిన తమ్ముడు

అంత్యక్రియల ఖర్చులపై అన్నదమ్ముల మధ్య గొడవ.. కత్తెరతో అన్నను చంపిన తమ్ముడు
16-08-2026 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కత్తెరతో దాడి.. వెంకటేశ్‌ (28) మృతి | పరారీలో శివ.. పోలీసుల గాలింపు

చైతన్యపురి: తండ్రి అంత్యక్రియల ఖర్చుల విషయంలో మొదలైన అన్నదమ్ముల మధ్య వివాదం చివరకు హత్యకు దారితీసింది. డబ్బుల విషయమై జరిగిన గొడవలో తమ్ముడు కత్తెరతో అన్నపై దాడి చేయడంతో వెంకటేశ్‌ (28) అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చంపాపేట కుమ్మరిబస్తీలో శనివారం చోటుచేసుకుంది.

తండ్రి అంత్యక్రియల ఖర్చుల్లో తన వాటా ఇవ్వలేదంటూ వెంకటేశ్‌ తమ్ముడు శివ (26) కొంతకాలంగా అన్నతో గొడవపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో శనివారం మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో శివ కత్తెరతో వెంకటేశ్‌పై దాడి చేసినట్లు సమాచారం.

తీవ్ర గాయాలతో వెంకటేశ్‌ మృతి చెందాడు. ఘటన అనంతరం శివ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న సరూర్‌నగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.. హత్యకు దారితీసిన పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Sthanikam

అంత్యక్రియల ఖర్చులపై అన్నదమ్ముల మధ్య గొడవ.. కత్తెరతో అన్నను చంపిన తమ్ముడు

Article Image

కత్తెరతో దాడి.. వెంకటేశ్‌ (28) మృతి | పరారీలో శివ.. పోలీసుల గాలింపు

చైతన్యపురి: తండ్రి అంత్యక్రియల ఖర్చుల విషయంలో మొదలైన అన్నదమ్ముల మధ్య వివాదం చివరకు హత్యకు దారితీసింది. డబ్బుల విషయమై జరిగిన గొడవలో తమ్ముడు కత్తెరతో అన్నపై దాడి చేయడంతో వెంకటేశ్‌ (28) అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చంపాపేట కుమ్మరిబస్తీలో శనివారం చోటుచేసుకుంది.

తండ్రి అంత్యక్రియల ఖర్చుల్లో తన వాటా ఇవ్వలేదంటూ వెంకటేశ్‌ తమ్ముడు శివ (26) కొంతకాలంగా అన్నతో గొడవపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో శనివారం మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో శివ కత్తెరతో వెంకటేశ్‌పై దాడి చేసినట్లు సమాచారం.

తీవ్ర గాయాలతో వెంకటేశ్‌ మృతి చెందాడు. ఘటన అనంతరం శివ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న సరూర్‌నగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.. హత్యకు దారితీసిన పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News