నల్లగొండ: భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)-2 ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఆర్. లక్ష్మా జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని అన్నారు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి పౌరుడు క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ దేశ ప్రగతికి తోడ్పడాలని సూచించారు.
దేశాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఎల్ఐసీ ఆర్థిక చేయూత అందిస్తూ తనవంతు పాత్ర పోషిస్తోందన్నారు. కుటుంబ పెద్దలను కోల్పోయిన సమయంలో బీమా పాలసీల ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు, ఏజెంట్ మిత్రులు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.
ఎల్ఐసీలో చోటుచేసుకుంటున్న డిజిటల్ మార్పులకు అనుగుణంగా పాలసీదారులకు అవగాహన కల్పించాలని ఏజెంట్లను కోరారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడినప్పుడే దేశం బలపడుతుందని, ప్రతి పౌరుడు కనీసం ఒక జీవిత బీమా పాలసీ తీసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
కార్యక్రమంలో ఎల్ఐసీ ఏజెంట్లు, కార్యవర్గ సిబ్బంది, ఉద్యోగులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి