Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వట్టిమర్తి పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 08:55 PM

ఎల్‌ఐసీ-2 ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు

ఎల్‌ఐసీ-2 ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు

ఎల్‌ఐసీ-2 ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు
15-08-2026 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ: భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)-2 ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ ఆర్‌. లక్ష్మా జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని అన్నారు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి పౌరుడు క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ దేశ ప్రగతికి తోడ్పడాలని సూచించారు.

దేశాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఎల్‌ఐసీ ఆర్థిక చేయూత అందిస్తూ తనవంతు పాత్ర పోషిస్తోందన్నారు. కుటుంబ పెద్దలను కోల్పోయిన సమయంలో బీమా పాలసీల ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు, ఏజెంట్‌ మిత్రులు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.

ఎల్‌ఐసీలో చోటుచేసుకుంటున్న డిజిటల్‌ మార్పులకు అనుగుణంగా పాలసీదారులకు అవగాహన కల్పించాలని ఏజెంట్లను కోరారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడినప్పుడే దేశం బలపడుతుందని, ప్రతి పౌరుడు కనీసం ఒక జీవిత బీమా పాలసీ తీసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

కార్యక్రమంలో ఎల్‌ఐసీ ఏజెంట్లు, కార్యవర్గ సిబ్బంది, ఉద్యోగులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ఎల్‌ఐసీ-2 ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు

Article Image

నల్లగొండ: భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)-2 ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ ఆర్‌. లక్ష్మా జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని అన్నారు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి పౌరుడు క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ దేశ ప్రగతికి తోడ్పడాలని సూచించారు.

దేశాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఎల్‌ఐసీ ఆర్థిక చేయూత అందిస్తూ తనవంతు పాత్ర పోషిస్తోందన్నారు. కుటుంబ పెద్దలను కోల్పోయిన సమయంలో బీమా పాలసీల ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు, ఏజెంట్‌ మిత్రులు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.

ఎల్‌ఐసీలో చోటుచేసుకుంటున్న డిజిటల్‌ మార్పులకు అనుగుణంగా పాలసీదారులకు అవగాహన కల్పించాలని ఏజెంట్లను కోరారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడినప్పుడే దేశం బలపడుతుందని, ప్రతి పౌరుడు కనీసం ఒక జీవిత బీమా పాలసీ తీసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

కార్యక్రమంలో ఎల్‌ఐసీ ఏజెంట్లు, కార్యవర్గ సిబ్బంది, ఉద్యోగులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News