నల్లగొండ: భారతీయ జీవిత బీమా సంస్థ నల్లగొండ బ్రాంచ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బ్రాంచ్ మేనేజర్ వెంకటేశ్వర్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని, వారి ఆశయాలను కొనసాగిస్తూ ప్రతి పౌరుడు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి దేశ ప్రగతికి తోడ్పడాలని అన్నారు. దేశాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఎల్ఐసీ ఆర్థికంగా అండగా నిలుస్తూ దేశ ప్రగతిలో తనవంతు పాత్ర పోషిస్తోందని తెలిపారు. కుటుంబ పెద్దలను కోల్పోయిన వారికి బీమా ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
ఎల్ఐసీలో వస్తున్న డిజిటల్ మార్పులకు అనుగుణంగా పాలసీదారులకు అవగాహన కల్పించాలని ఏజెంట్లను కోరారు. సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు, ఏజెంట్ మిత్రులు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు, ఏజెంట్లు మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడినప్పుడే దేశం బలపడుతుందని అన్నారు. ప్రతి పౌరుడు కనీసం ఒక జీవిత బీమా పాలసీ తీసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ మునిధర్రావు, సిబ్బంది వెంకన్న, యాదగిరి, లింగయ్య, శ్రీనివాసులు, ఏజెంట్లు వెంకన్న, రామ్మూర్తి, రామలింగం, శివశంకర్, యాదయ్య, మహేశ్వరి, కవిత, వేణుమాధవ్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి