నల్లగొండ:
నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు వైపు ఉన్న అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరింగ్ ట్రాన్స్ఫార్మర్స్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఈ కట్కూరి శ్రీనివాస్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే నేడు దేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరులను స్మరించుకోవాల్సిన రోజు ఇదని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయులు ఐక్యంగా పోరాడి దేశానికి స్వాతంత్ర్యం సాధించారని తెలిపారు.
తెలుగువారి పోరాటం స్ఫూర్తిదాయకం.
స్వాతంత్ర్య ఉద్యమంలో తెలుగు ప్రాంతానికి చెందిన పలువురు మహనీయులు కీలక పాత్ర పోషించారని, వారి పోరాటం, త్యాగాలు దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమని శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నేటి తరం కొనసాగించాలని సూచించారు.
కార్యక్రమంలో డీఈ ప్రభాకర్, ఏడీఈ సతీష్, ఏఈ శ్రీధర్రెడ్డి, వెంకటేష్రెడ్డి, వెంకటేశ్వర్లు, రమేష్కుమార్, కార్యవర్గ సిబ్బంది రాజు, సమ్మిరెడ్డి, భీమా, అర్జున్రెడ్డి, రమేష్కుమార్, పాండు, రమేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి