తుంగతుర్తి;
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తుంగతుర్తిమండల ఎంపీడీవో చలపతిరావు తెలిపారు. శనివారం ఎంపీడీవో చలపతి మీడియాతో మాట్లాడుతూ.. మండల ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకు రావచ్చన్నారు. మండలానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజావాణికి హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి తగిన మార్గం చూపుతారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయాలని కోరారు.ఇట్టి మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం లో మండల స్థాయిలో ఉన్న అందరు అధికారులు హాజరై వారి వారి శాఖాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని వారు అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి