దండు మల్కాపురంలో గ్రామసభ రసాభాస
దండు మల్కాపురంలో గ్రామసభ రసాభాస
K.RAVI
నిధుల అవకతవకలపై గ్రామస్తుల నిరసన.. సభ బహిష్కరణ
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో నిర్వహించిన గ్రామసభ తీవ్ర ఉద్రిక్తతల నడుమ రసాభాసగా మారింది. గతంలో ప్రత్యేక అధికారి పాలనలో సుమారు రూ. 1.20 కోట్ల పంచాయతీ నిధులు దుర్వినియోగం కాగా, అందులో ఇంకా తేలాల్సిన రూ. 54 లక్షల బకాయిలపై గ్రామ కార్యదర్శి రమాదేవిని గ్రామస్తులు నిలదీశారు. ఆమె ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో సభను బహిష్కరించి పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.తాను బిఆర్ఎస్ సర్పంచ్ను కావడంతోనే అధికార పార్టీ అండతో కార్యదర్శి రికార్డులు ఇవ్వకుండా పంచాయతీని నిర్లక్ష్యం చేస్తున్నారని సర్పంచ్ గీర్కాటి నిరంజన్ ఆరోపించారు. రికార్డుల కోసం సర్పంచ్నైన నన్నే ఆర్ టీ ఐ దరఖాస్తు చేసుకోమంటున్నారని, కలెక్టర్, ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల లెక్క తేలేవరకు ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి