Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దండు మల్కాపురంలో గ్రామసభ రసాభాస కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 04, 2026 11:01 PM

దండు మల్కాపురంలో గ్రామసభ రసాభాస

దండు మల్కాపురంలో గ్రామసభ రసాభాస

దండు మల్కాపురంలో గ్రామసభ రసాభాస
August 04, 2026 09:01 PM 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నిధుల అవకతవకలపై గ్రామస్తుల నిరసన.. సభ బహిష్కరణ

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో నిర్వహించిన గ్రామసభ తీవ్ర ఉద్రిక్తతల నడుమ రసాభాసగా మారింది. గతంలో ప్రత్యేక అధికారి పాలనలో సుమారు రూ. 1.20 కోట్ల పంచాయతీ నిధులు దుర్వినియోగం కాగా, అందులో ఇంకా తేలాల్సిన రూ. 54 లక్షల బకాయిలపై గ్రామ కార్యదర్శి రమాదేవిని గ్రామస్తులు నిలదీశారు. ఆమె ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో సభను బహిష్కరించి పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.​తాను బిఆర్ఎస్ సర్పంచ్‌ను కావడంతోనే అధికార పార్టీ అండతో కార్యదర్శి రికార్డులు ఇవ్వకుండా పంచాయతీని నిర్లక్ష్యం చేస్తున్నారని సర్పంచ్ గీర్కాటి నిరంజన్ ఆరోపించారు. రికార్డుల కోసం సర్పంచ్‌నైన నన్నే ఆర్ టీ ఐ దరఖాస్తు చేసుకోమంటున్నారని, కలెక్టర్, ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల లెక్క తేలేవరకు ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News