Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేపటి నుండి ఉచిత యోగ శిక్షణా తరగతులు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 04, 2026 04:29 PM

ఆకారంలో మళ్లీ మానవత్వం ఓడిందా..?

ఆకారంలో మళ్లీ మానవత్వం ఓడిందా..?

ఆకారంలో మళ్లీ మానవత్వం ఓడిందా..?
August 04, 2026 02:45 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

శాలిగౌరారం మండలం, ఆకారం:

ఆకారం గ్రామంలో ఐతగోని అక్కులయ్య మృతితో మరోసారి కుటుంబ వెలివేత, సహాయ నిరాకరణ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఏడు నెలల క్రితం ఆయన భార్య శాంతమ్మ మరణించిన సమయంలో అంత్యక్రియలు ఆస్తి వివాదంతో వివాదాస్పదంగా మారగా, ఇప్పుడు అక్కులయ్య మరణానంతరం కూడా అదే పరిస్థితి నెలకొన్నట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాధలో ఉన్న కుటుంబానికి గ్రామస్థులు, పెద్దలు చేయూత అందించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక మనిషి చివరి ప్రయాణంలో మానవత్వం, సామాజిక బాధ్యతలు ముందుండాల్సిన సమయంలో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కావడం గ్రామంలో చర్చనీయాంశమైంది.

ఈ ఘటనపై గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సమాజంలో మానవీయ విలువలను కాపాడాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News