Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య బాధితులకు భరోసా దక్కేవరకు పోరాడతాం! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 23, 2026 02:27 PM

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య
July 23, 2026 12:21 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర పోలీస్ హెడ్‌క్వార్టర్స్ (డీజీపీ కార్యాలయం) ప్రాంగణంలో గురువారం తెల్లవారుజామున విషాద సంఘటన చోటుచేసుకుంది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ ఆయుధంతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని సృష్టించింది.

బాధితుడి నేపథ్యం:

మృతుడు స్వామి స్వగ్రామం నల్గొండ జిల్లా, చిట్యాల మండలానికి చెందిన వెలిమినేడు కాగా, ఆయన కుటుంబంతో కలిసి ప్రస్తుతం బండ్లగూడ జాగీర్, కిస్మత్‌పూర్ వ్యాసపురి కాలనీ సమీపంలో నివాసముంటున్నారు.

ఘటన వివరాలు:

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గురువారం తెల్లవారుజామున సుమారు 5:30 గంటల ప్రాంతంలో డీజీపీ కార్యాలయ ఆవరణలోని వాష్‌రూమ్‌లోకి వెళ్లిన స్వామి, తన వద్ద ఉన్న సర్వీస్ తుపాకీతో కాల్పులు జరుపుకున్నారు. తీవ్ర గాయాలపాలైన ఆయన ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు, క్లూస్ టీమ్ మరియు ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

సూసైడ్ నోట్ లభ్యం – కుటుంబానికి భావోద్వేగ సందేశం:

సంఘటనా స్థలంలో పోలీసులు ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు. అందులో స్వామి రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. "ఏదైనా తప్పు జరిగి ఉంటే అది నా వల్లే జరిగింది. నా భార్య, పిల్లలు చాలా మంచివాళ్లు. నేను లేకపోయినా నా భార్యాపిల్లలను ఎవరైనా వేధిస్తే దెయ్యమై వస్తాను. కొడుకా... మీ అమ్మను, అక్కను జాగ్రత్తగా చూసుకో" అని ఆయన ఆ నోట్‌లో భావోద్వేగంగా పేర్కొన్నారు.

ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు:

కానిస్టేబుల్ ఆత్మహత్యకు ఆన్‌లైన్ బెట్టింగ్ మూలంగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు లేదా కుటుంబంలో తలెత్తిన మనస్పర్థలే ప్రధాన కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. విషయం తెలిసిన వెంటనే స్వామి కుటుంబసభ్యులు డీజీపీ ఆఫీస్‌కు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News