ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. యువకుడి ఆత్మహత్య
ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. యువకుడి ఆత్మహత్య
K.RAVI
ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఎలక్ట్రీషియన్ మృతి
చౌటుప్పల్ పట్టణ పరిధిలో ఓ యువకుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ టౌన్ పరిధిలోని చిన్నకొండూర్ రోడ్డుకు చెందిన గంట యాదమ్మ, వెంకటయ్య దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. వీరి కుమారుడు గంట శ్రీకాంత్ (27) వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం (ఈరోజు) ఉదయం 9 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి, శ్రీకాంత్ ఫ్యాన్కు చీరతో ఉరివేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు అతను వేలాడుతూ నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తల్లి గంట యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కేసును ఎస్ఐ కె. యాదగిరి దర్యాప్తు చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి