స్వాతంత్ర్య సమరయోధుల భవనం ఖాళీ..
స్వాతంత్ర్య సమరయోధుల భవనం ఖాళీ..
NM Yadav
టూటౌన్ ఎస్ఐ సైదా బాబు చొరవ..
2011 నుంచి అద్దె చెల్లించకుండా మొండికేసిన కిరాయిదారుడు..
డీఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగి సమస్య పరిష్కరించిన పోలీసులు..
నల్గొండ : పట్టణంలోని స్వాతంత్ర్య సమరయోధుల భవనానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యను నల్గొండ టూటౌన్ పోలీసులు చాకచక్యంగా పరిష్కరించారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక స్వాతంత్ర్య సమరయోధుల భవనంలో వెంకటరమణ అనే వ్యక్తి 2011 నుంచి అద్దెకు నివాసం ఉంటున్నాడు. అయితే, గత కొంతకాలంగా అతను భవన యాజమాన్యానికి అద్దె చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దీంతో విసిగిపోయిన స్వాతంత్ర్య సమరయోధుల కమిటీ ప్రతినిధులు తమ సమస్యను నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. డీఎస్పీ ఆదేశాల మేరకు టూటౌన్ ఎస్ఐ సైదాబాబు తక్షణమే స్పందించారు. స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం అద్దెదారుడితో చట్టబద్ధమైన విధానంలో మాట్లాడి, కౌన్సిలింగ్ నిర్వహించి భవనాన్ని ఖాళీ చేయించారు.
పోలీసులకు కృతజ్ఞతలు..
చాలా కాలంగా నలుగుతున్న సమస్యను సకాలంలో స్పందించి పరిష్కరించిన టూటౌన్ ఎస్ఐ సైదాబాబుకు స్వాతంత్ర్య సమరయోధులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, సేవాభావంతో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారుల తీరును వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ చంద్రశేఖర్, ఏఎస్ఐ ఉమారాణి, కమిటీ ప్రతినిధి కొప్పు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి