Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కళ్లకు గంతలు.. ఫ్లైఓవర్‌కు గండాలు! అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 17, 2026 01:40 PM

కళ్లకు గంతలు.. ఫ్లైఓవర్‌కు గండాలు!

కళ్లకు గంతలు.. ఫ్లైఓవర్‌కు గండాలు!

కళ్లకు గంతలు.. ఫ్లైఓవర్‌కు గండాలు!
July 17, 2026 11:57 AM 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


చిట్యాలలో బీఆర్ఎస్ వినూత్న నిరసన.. నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్.


నల్గొండ జిల్లా

చిట్యాల పట్టణ కేంద్రంలో గత రెండేళ్లుగా కొనసాగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనుల ఆలస్యంపై బీఆర్ఎస్ నాయకులు గురువారం వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద కళ్లకు గంతలు కట్టుకుని ఆందోళనకు దిగిన వారు, పనుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు.

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై అత్యంత రద్దీ ప్రాంతమైన చిట్యాల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం నత్తనడకన సాగుతుండటంతో నిత్యం ట్రాఫిక్ సమస్య తీవ్ర రూపం దాల్చుతోందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతుండటంతో ప్రయాణికులు గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఆరు నెలల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన కాంట్రాక్టర్ ఇప్పటివరకు పనుల పురోగతిపై స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు. ఫ్లైఓవర్ పనుల కారణంగా పట్టణ ప్రజలు రోడ్లు దాటడానికే నరకయాతన అనుభవిస్తున్నారని, వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్న ఈ పరిస్థితిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, ఫ్లైఓవర్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పనులు పూర్తి కాకపోతే ప్రజలతో కలిసి మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News