కాంగ్రెస్లో కొత్త మార్గదర్శకాలు..! పాలాభిషేకాలు, క్రేన్ తో గజమాలలకు బ్రేక్
కాంగ్రెస్లో కొత్త మార్గదర్శకాలు..! పాలాభిషేకాలు, క్రేన్ తో గజమాలలకు బ్రేక్
Komidala Mahender reddy
కాంగ్రెస్ పార్టీ నేతల ఫోటోలకు పాలాభిషేకాలు చేయడం, క్రేన్ ల తో భారీ గజమాలలు వేయడం వంటి ఆర్భాట కార్యక్రమాలను నిలిపివేయాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సూచించినట్లు సమాచారం.
నేతల పట్ల అభిమానాన్ని చాటుకునే పేరుతో నిర్వహిస్తున్న అతిశయ ప్రదర్శనలు పార్టీ సంస్కృతికి విరుద్ధమని ఆమె అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారంపైనే నాయకులు, కార్యకర్తలు దృష్టి సారించాలని సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇకపై నేతల ఫోటోలకు పాలాభిషేకాలు, క్రేన్ లతో గజమాలలు, భారీ కటౌట్లు, ఆడంబర స్వాగత కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు సమాచారం. సాధారణ ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, పార్టీ కార్యకలాపాల్లో నిరాడంబరత పాటించాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఈ నిర్ణయంతో పార్టీ కార్యక్రమాల్లో ఆర్భాటాలకు చెక్ పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి