PRINT TIME: July 11, 2026 08:35 PM
జూలై 24లోపు ఎస్ఐఆర్ ఫారాలు సమర్పించండి: వై. పండరి పిలుపు
జూలై 24లోపు ఎస్ఐఆర్ ఫారాలు సమర్పించండి: వై. పండరి పిలుపు
July 11, 2026 07:07 PM
138 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో నాగల్గిద్ద మండలం ఔదత్పూర్ గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి తన ఎస్ఐఆర్ ఫారాన్ని నింపి సూపర్వైజర్ అనిల్రెడ్డి, బీఎల్వో దత్తమ్మ, జీపీవో జమీరుద్దీన్కు అందజేశారు. ఈ సందర్భంగా బీఎల్వో దత్తమ్మ మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటివరకు 65 శాతం ఎస్ఐఆర్ నమోదు పూర్తయిందని, మిగిలిన అర్హులందరూ జూలై 24లోపు తప్పనిసరిగా ఫారాలు నింపి సమర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి. హనుమంత్, కాశయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి