Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి అర్హ ఓటరును నమోదు చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 08:35 PM

మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్

మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్

మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్
July 11, 2026 07:21 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ పట్టణంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షురాలు శ్రీమతి వహీదా బేగం అధ్యక్షతన నిర్వహించిన మిస్డ్ కాల్ కార్యక్రమానికి జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అస్మా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశ జనాభాలో మహిళలు అధికంగా ఉన్నప్పటికీ రాజకీయాల్లో వారికి తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదని, ఇక ఆలస్యం చేయకుండా నారి శక్తి వందన్ చట్టాన్ని అమలు చేసి మహిళా రిజర్వేషన్ బిల్లును జూలై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళా కాంగ్రెస్ చేపట్టిన మిస్డ్ కాల్ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున స్పందించి బిల్లుకు తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వరూప రాణి, గంగామణి, ఆఫ్రోజ్ బేగం, సలేహా బేగం, మైమూనా, అంజలి, మేఘమాల, అలియా బేగం, సురేఖ, అనిత, స్వప్న, శివమ్మతో పాటు వివిధ వార్డుల మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News