మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్
Krishna
జహీరాబాద్ పట్టణంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షురాలు శ్రీమతి వహీదా బేగం అధ్యక్షతన నిర్వహించిన మిస్డ్ కాల్ కార్యక్రమానికి జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అస్మా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశ జనాభాలో మహిళలు అధికంగా ఉన్నప్పటికీ రాజకీయాల్లో వారికి తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదని, ఇక ఆలస్యం చేయకుండా నారి శక్తి వందన్ చట్టాన్ని అమలు చేసి మహిళా రిజర్వేషన్ బిల్లును జూలై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళా కాంగ్రెస్ చేపట్టిన మిస్డ్ కాల్ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున స్పందించి బిల్లుకు తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వరూప రాణి, గంగామణి, ఆఫ్రోజ్ బేగం, సలేహా బేగం, మైమూనా, అంజలి, మేఘమాల, అలియా బేగం, సురేఖ, అనిత, స్వప్న, శివమ్మతో పాటు వివిధ వార్డుల మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి