: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని కుంకుడు పాముల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువ రైతు గొలుసుల వెంకన్న యాదవ్ (29) కరెంట్ షాక్కు గురై మృతి చెందాడు.
గ్రామస్తుల కథనం ప్రకారం.. గురువారం ఉదయం నాటు పనుల కోసం కూలీలు పొలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో మోటారు విద్యుత్ సరఫరాను నిలిపివేసేందుకు వెంకన్న వెళ్లగా, ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలింది. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
యువ రైతు ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి