Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 09:47 PM

ప్రభుత్వ విద్య బలోపేతానికి చర్యలు చేపట్టాలి. ప్రైవేట్ ఫీజుల దోపిడీని అరికట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్.

ప్రభుత్వ విద్య బలోపేతానికి చర్యలు చేపట్టాలి. ప్రైవేట్ ఫీజుల దోపిడీని అరికట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్.

ప్రభుత్వ విద్య బలోపేతానికి చర్యలు చేపట్టాలి.  ప్రైవేట్ ఫీజుల దోపిడీని అరికట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్.
July 10, 2026 08:38 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ రామన్నపేట మండలంలో విజయవంతమైంది. మండలంలోని పలు గ్రామాల్లో విద్యార్థులు స్వచ్ఛందంగా తరగతులను బహిష్కరించి బంద్‌కు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేయడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడంతో పాటు తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్, ఫర్నిచర్, డిజిటల్ బోధన వంటి మౌలిక సదుపాయాలను తక్షణమే కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రైవేట్ విద్యాసంస్థలు నియంత్రణ లేకుండా అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయని విమర్శించారు. ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యను వ్యాపార వస్తువుగా మార్చే విధానాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన, ఉచిత, సమాన విద్య అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.

విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. మండలంలో నిర్వహించిన బంద్‌కు డీవైఎఫ్‌ఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యురాలు పెద్ది అక్షిత, మండల నాయకులు పిట్టల నవీన్, తుర్కపల్లి లోకేష్, బూడిద ఆదిత్య, అప్పం అభిరూప్, నవదీప్, భూక్య సంతోష్, లోకేష్ శివమణి, నాగటి, చందు, నరేష్, జస్వంత్, సంజయ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News