Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పూర్తిస్థాయి కమిషనర్‌ను వెంటనే నియమించాలి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల డిమాండ్. నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 07:47 PM

పూర్తిస్థాయి కమిషనర్‌ను వెంటనే నియమించాలి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల డిమాండ్.

పూర్తిస్థాయి కమిషనర్‌ను వెంటనే నియమించాలి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల డిమాండ్.

పూర్తిస్థాయి కమిషనర్‌ను వెంటనే నియమించాలి.  తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల డిమాండ్.
July 10, 2026 06:39 PM 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP)కు పూర్తిస్థాయి డైరెక్టర్/కమిషనర్‌ను వెంటనే నియమించాలని మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రామన్నపేట శాఖ అధ్యక్షుడు టి. శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు శుక్రవారం రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్యోగులు నిరసన చేపట్టారు. గత కమిషనర్ మే నెలలో పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఆ స్థానంలో పూర్తిస్థాయి అధికారి నియామకం జరగకపోవడంతో పలు పరిపాలనా సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా టి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మెడికల్ ఎడ్యుకేషన్ విభాగానికి బదిలీ అయిన ఆసుపత్రుల్లో పనిచేస్తున్న టీవీవీపీ ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ ఆలస్యం కావడం, సాధారణ బదిలీల సమస్యలు, పదోన్నతులు, సర్వీసుల క్రమబద్ధీకరణ, జీఓ-190 అమలు జాప్యం, కాంట్రాక్ట్ ఉద్యోగుల కొనసాగింపు ఉత్తర్వులు జారీ కాకపోవడం, పెండింగ్ బిల్లుల చెల్లింపులో ఆలస్యం వంటి అనేక సమస్యలు పేరుకుపోయాయని పేర్కొన్నారు.

ఈ సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులను నేరుగా సంప్రదించే అవకాశం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్‌గా మారనున్న తెలంగాణ వైద్య విధాన పరిషత్‌కు అర్హత, అనుభవం కలిగిన అధికారిని పూర్తిస్థాయి డైరెక్టర్/కమిషనర్‌గా వెంటనే నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ నిరసన కార్యక్రమంలో పి. శ్రీనివాస్, శ్రీలత, రమేష్, గణేష్, వాసంతి, జ్యోతి, సంగీత, ప్రసన్న, సుశీల, శారద, మాలిక్, నాగవర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News