రామన్నపేట, జూలై 9: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామానికి చెందిన కడారి భిక్షం యాదవ్ కుమార్తె నిశ్చితార్థ వేడుక గురువారం చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం గ్రామంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నిదానపల్లి గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించి సంప్రదాయబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
వేడుక ఆప్యాయతల నడుమ ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగగా, హాజరైన అతిథులు నూతన జంటకు సుఖసంతోషాలతో కూడిన దాంపత్య జీవితం కలగాలని ఆకాంక్షించారు. నిశ్చితార్థ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలు పాల్గొని సందడి చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి