ఆర్డీవోకు వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకుడు సుర్వి యాదయ్య గౌడ్
చౌటుప్పల్ పట్టణ పరిధిలో కొనసాగుతున్న జాతీయ రహదారి బ్రిడ్జి, రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసి, వాహనదారులు, ప్రజల ఇబ్బందులను తక్షణమే తొలగించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుర్వి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు చౌటుప్పల్ ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారితో పాటు వలిగొండ, మునుగోడు, నారాయణపూర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు బ్రిడ్జి పనుల వల్ల తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ పెరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. నిర్మాణ ప్రాంతంలో సరైన బారికేడ్లు, రాత్రివేళల్లో వెలుతురు ఏర్పాటు చేసి, ఆర్అండ్బీ అధికారుల పర్యవేక్షణలో పనులను వేగవంతం చేయాలని కోరారు. స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి పనులను పూర్తి చేయించేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ కొయ్యడ శేఖర్ గౌడ్, మునుగోడు బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షులు నల్పరాజు రమేష్, మండల నాయకులు బోయ శ్రీరాములు, ధర్మోజిగూడెం గ్రామ అధ్యక్షులు బత్తుల సింహాద్రి, నారాయణపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు తెలంగాణ భిక్షం, గుజ్జ గ్రామ శాఖ అధ్యక్షులు సత్తయ్య, నాయకులు పొట్ట జంగయ్య, సుర్వి లింగస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి