Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాలలో యువకుడి ఆత్మహత్య అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 08:31 PM

చౌటుప్పల్ లో వంతెన పనులను వేగవంతం చేయాలి

చౌటుప్పల్ లో వంతెన పనులను వేగవంతం చేయాలి

చౌటుప్పల్ లో వంతెన పనులను వేగవంతం చేయాలి
24-08-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఆర్‌డీవోకు వినతిపత్రం అందజేసిన బీఆర్‌ఎస్ నాయకుడు సుర్వి యాదయ్య గౌడ్

చౌటుప్పల్ పట్టణ పరిధిలో కొనసాగుతున్న జాతీయ రహదారి బ్రిడ్జి, రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసి, వాహనదారులు, ప్రజల ఇబ్బందులను తక్షణమే తొలగించాలని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుర్వి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు చౌటుప్పల్ ఆర్‌డీవోకు వినతిపత్రం సమర్పించారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారితో పాటు వలిగొండ, మునుగోడు, నారాయణపూర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు బ్రిడ్జి పనుల వల్ల తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ పెరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. నిర్మాణ ప్రాంతంలో సరైన బారికేడ్లు, రాత్రివేళల్లో వెలుతురు ఏర్పాటు చేసి, ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణలో పనులను వేగవంతం చేయాలని కోరారు. స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి పనులను పూర్తి చేయించేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ కొయ్యడ శేఖర్ గౌడ్, మునుగోడు బీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ అధ్యక్షులు నల్పరాజు రమేష్, మండల నాయకులు బోయ శ్రీరాములు, ధర్మోజిగూడెం గ్రామ అధ్యక్షులు బత్తుల సింహాద్రి, నారాయణపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు తెలంగాణ భిక్షం, గుజ్జ గ్రామ శాఖ అధ్యక్షులు సత్తయ్య, నాయకులు పొట్ట జంగయ్య, సుర్వి లింగస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్ లో వంతెన పనులను వేగవంతం చేయాలి

Article Image

ఆర్‌డీవోకు వినతిపత్రం అందజేసిన బీఆర్‌ఎస్ నాయకుడు సుర్వి యాదయ్య గౌడ్

చౌటుప్పల్ పట్టణ పరిధిలో కొనసాగుతున్న జాతీయ రహదారి బ్రిడ్జి, రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసి, వాహనదారులు, ప్రజల ఇబ్బందులను తక్షణమే తొలగించాలని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుర్వి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు చౌటుప్పల్ ఆర్‌డీవోకు వినతిపత్రం సమర్పించారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారితో పాటు వలిగొండ, మునుగోడు, నారాయణపూర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు బ్రిడ్జి పనుల వల్ల తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ పెరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. నిర్మాణ ప్రాంతంలో సరైన బారికేడ్లు, రాత్రివేళల్లో వెలుతురు ఏర్పాటు చేసి, ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణలో పనులను వేగవంతం చేయాలని కోరారు. స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి పనులను పూర్తి చేయించేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ కొయ్యడ శేఖర్ గౌడ్, మునుగోడు బీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ అధ్యక్షులు నల్పరాజు రమేష్, మండల నాయకులు బోయ శ్రీరాములు, ధర్మోజిగూడెం గ్రామ అధ్యక్షులు బత్తుల సింహాద్రి, నారాయణపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు తెలంగాణ భిక్షం, గుజ్జ గ్రామ శాఖ అధ్యక్షులు సత్తయ్య, నాయకులు పొట్ట జంగయ్య, సుర్వి లింగస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News