హైదరాబాద్లోని చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ‘శ్రీ మహాశాస్త్ర సేవా సంఘం’ ఆధ్వర్యంలో ఆదివారం గురు పురస్కార అవార్డు మహోత్సవం వైభవంగా జరిగింది. సంఘం వ్యవస్థాపకులు సూదగాని రాజు గురుస్వామి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ శ్రీ సత్యదేవ సహిత అయ్యప్పస్వామి దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ బొబ్బిళ్ళ మురళీ గురుస్వామి 'ఉత్తమ గురు పురస్కారం' అందుకున్నారు. సాక్షాత్ అయ్యప్ప వంశస్థులు, శబరిమలైకి చెందిన పందల రాజకుటుంబీకులు తిరునాల్ సురేష్ వర్మ చేతుల మీదుగా ఈ అవార్డును మురళీ గురుస్వామికి బహుకరించారు. ఆధ్యాత్మిక సేవలో విశేష కృషి చేస్తున్నందుకు గాను ఆయనకు ఈ గౌరవం దక్కింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలరాజు గురుస్వామి, ప్రదీప్ తంత్రి గురుస్వామి, తంగవేలు సంతోష్ గురుస్వామి, భరణి వెంకటేష్ గురుస్వామి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి విచ్చేసిన 118 మంది గురుస్వాములకు ఈ సందర్భంగా గురు పురస్కారాలు, అన్నపూర్ణ అవార్డులను ప్రధానం చేశారు.
మురళీ గురుస్వామికి ఘనంగా 'ఉత్తమ గురు పురస్కారం' ప్రదానం
మురళీ గురుస్వామికి ఘనంగా 'ఉత్తమ గురు పురస్కారం' ప్రదానం
K.RAVI
హైదరాబాద్లోని చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ‘శ్రీ మహాశాస్త్ర సేవా సంఘం’ ఆధ్వర్యంలో ఆదివారం గురు పురస్కార అవార్డు మహోత్సవం వైభవంగా జరిగింది. సంఘం వ్యవస్థాపకులు సూదగాని రాజు గురుస్వామి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ శ్రీ సత్యదేవ సహిత అయ్యప్పస్వామి దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ బొబ్బిళ్ళ మురళీ గురుస్వామి 'ఉత్తమ గురు పురస్కారం' అందుకున్నారు. సాక్షాత్ అయ్యప్ప వంశస్థులు, శబరిమలైకి చెందిన పందల రాజకుటుంబీకులు తిరునాల్ సురేష్ వర్మ చేతుల మీదుగా ఈ అవార్డును మురళీ గురుస్వామికి బహుకరించారు. ఆధ్యాత్మిక సేవలో విశేష కృషి చేస్తున్నందుకు గాను ఆయనకు ఈ గౌరవం దక్కింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలరాజు గురుస్వామి, ప్రదీప్ తంత్రి గురుస్వామి, తంగవేలు సంతోష్ గురుస్వామి, భరణి వెంకటేష్ గురుస్వామి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి విచ్చేసిన 118 మంది గురుస్వాములకు ఈ సందర్భంగా గురు పురస్కారాలు, అన్నపూర్ణ అవార్డులను ప్రధానం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి