Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మురళీ గురుస్వామికి ఘనంగా 'ఉత్తమ గురు పురస్కారం' ప్రదానం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 23, 2026 05:57 PM

ఆర్థిక స్వావలంబనకు పొదుపే తొలి అడుగు:మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమం

ఆర్థిక స్వావలంబనకు పొదుపే తొలి అడుగు:మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమం

ఆర్థిక స్వావలంబనకు పొదుపే తొలి అడుగు:మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమం
23-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో దుదంగోడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన స్వయం సహాయక సంఘాల శిక్షణ కార్యక్రమంలో పాలమూరు మండల సమాఖ్య సీఆర్పీ ట్రైనర్ స్వప్న ,జమ్బేశ్వర్ మాట్లాడుతూ.. మహిళలు పొదుపు అలవాటును పెంపొందించుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. సంఘాల నిర్వహణ, బ్యాంకు రుణాలను సక్రమంగా వినియోగించుకోవడం, రుణాల ద్వారా ఆదాయం పెంచే జీవనోపాధి అవకాశాలను ఎంచుకోవడం వంటి అంశాలపై మహిళలకు అవగాహన కల్పించారు.మహిళా సంఘాలు పేదరిక నిర్మూలనతో పాటు కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి ఎంతో కీలకమని తెలిపారు. ప్రతి మహిళ క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ, అందుబాటులో ఉన్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను పెంచుకోవాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు, గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని దివ్య మంగమ్మ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీసీ హడమండ్లు,వీఓఏ కవిత, గ్రామ మహిళా సంఘాల అధ్యక్షురాలు సాయమ్మ, గ్రామ మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్థిక స్వావలంబనకు పొదుపే తొలి అడుగు:మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమం

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో దుదంగోడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన స్వయం సహాయక సంఘాల శిక్షణ కార్యక్రమంలో పాలమూరు మండల సమాఖ్య సీఆర్పీ ట్రైనర్ స్వప్న ,జమ్బేశ్వర్ మాట్లాడుతూ.. మహిళలు పొదుపు అలవాటును పెంపొందించుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. సంఘాల నిర్వహణ, బ్యాంకు రుణాలను సక్రమంగా వినియోగించుకోవడం, రుణాల ద్వారా ఆదాయం పెంచే జీవనోపాధి అవకాశాలను ఎంచుకోవడం వంటి అంశాలపై మహిళలకు అవగాహన కల్పించారు.మహిళా సంఘాలు పేదరిక నిర్మూలనతో పాటు కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి ఎంతో కీలకమని తెలిపారు. ప్రతి మహిళ క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ, అందుబాటులో ఉన్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను పెంచుకోవాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు, గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని దివ్య మంగమ్మ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీసీ హడమండ్లు,వీఓఏ కవిత, గ్రామ మహిళా సంఘాల అధ్యక్షురాలు సాయమ్మ, గ్రామ మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News