Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇల్లు ఇప్పిస్తానని మాయమాటలు.. దివ్యాంగ మహిళపై లైంగికదాడి మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 23, 2026 09:03 AM

ఇల్లు ఇప్పిస్తానని మాయమాటలు.. దివ్యాంగ మహిళపై లైంగికదాడి

ఇల్లు ఇప్పిస్తానని మాయమాటలు.. దివ్యాంగ మహిళపై లైంగికదాడి

ఇల్లు ఇప్పిస్తానని మాయమాటలు.. దివ్యాంగ మహిళపై లైంగికదాడి
23-08-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని నమ్మించి దివ్యాంగ మహిళపై లైంగికదాడికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చిన ఘటనపై వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తీవ్రంగా స్పందించింది. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, ఆరోపణలు నిజమని తేలితే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ఈ సందర్భంగా ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకం ద్వారా ఇల్లు ఇప్పిస్తానని నమ్మించి మహిళను మోసం చేసి లైంగికదాడికి పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. దివ్యాంగ మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని వేధింపులకు, దాడులకు పాల్పడటం మానవ హక్కులకు, దివ్యాంగుల హక్కులకు విరుద్ధమన్నారు.

బాధితురాలికి రక్షణ కల్పించాలి.

పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని, నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉపేందర్ కోరారు. బాధితురాలికి పూర్తి రక్షణ కల్పించి న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వ పథకాలు అందించే విషయంలో మధ్యవర్తులు, ఇతరుల జోక్యంతో మోసాలు, వేధింపులు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఎన్‌పీఆర్‌డీ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఆత్మకూరు మండల అధ్యక్షుడు రచ్చ బిక్షపతి, కార్యదర్శి వెంకన్న, ఉపాధ్యక్షుడు బుర్ర మధు, సహాయక కార్యదర్శి కే. గోవర్ధన్, జె. హైమావతి, బి. రాములు, యాట చందు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇల్లు ఇప్పిస్తానని మాయమాటలు.. దివ్యాంగ మహిళపై లైంగికదాడి

Article Image

భువనగిరి: ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని నమ్మించి దివ్యాంగ మహిళపై లైంగికదాడికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చిన ఘటనపై వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తీవ్రంగా స్పందించింది. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, ఆరోపణలు నిజమని తేలితే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ఈ సందర్భంగా ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకం ద్వారా ఇల్లు ఇప్పిస్తానని నమ్మించి మహిళను మోసం చేసి లైంగికదాడికి పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. దివ్యాంగ మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని వేధింపులకు, దాడులకు పాల్పడటం మానవ హక్కులకు, దివ్యాంగుల హక్కులకు విరుద్ధమన్నారు.

బాధితురాలికి రక్షణ కల్పించాలి.

పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని, నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉపేందర్ కోరారు. బాధితురాలికి పూర్తి రక్షణ కల్పించి న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వ పథకాలు అందించే విషయంలో మధ్యవర్తులు, ఇతరుల జోక్యంతో మోసాలు, వేధింపులు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఎన్‌పీఆర్‌డీ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఆత్మకూరు మండల అధ్యక్షుడు రచ్చ బిక్షపతి, కార్యదర్శి వెంకన్న, ఉపాధ్యక్షుడు బుర్ర మధు, సహాయక కార్యదర్శి కే. గోవర్ధన్, జె. హైమావతి, బి. రాములు, యాట చందు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News