Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్వచ్ఛంద సేవలతో జహీరాబాద్ అభివృద్ధికి కృషి చేయాలి:అధ్యక్షురాలు అస్మా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 22, 2026 09:54 PM

టీబీ క్షయ బాధితులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ

టీబీ క్షయ బాధితులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ

టీబీ క్షయ బాధితులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ
22-08-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

లయన్స్ క్లబ్, డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత సేవలు

క్షయ (టీబీ) వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడటంతో పాటు శరీరానికి అవసరమైన పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఎంతో ముఖ్యమని యాదాద్రి భువనగిరి జిల్లా డీఎంహెచ్‌ఓ ఎం. మనోహర్ తెలిపారు. చౌటుప్పల్‌లోని సేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దాచేపల్లి ప్రకాష్ గుప్తా అధ్యక్షతన, చౌటుప్పల్ డాక్టర్స్ అసోసియేషన్, బద్దం లింగారెడ్డి సౌజన్యంతో టీబీ బాధితులకు శనివారం పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఎంహెచ్‌ఓ మనోహర్ మాట్లాడుతూ.. నిరుపేద టీబీ రోగుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి పౌష్టికాహారం అందించడం అభినందనీయమన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో పోలియోను ఏ విధంగా నిర్మూలించామో, సమిష్టి కృషి ద్వారా టీబీ రహిత సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆర్గనైజర్ వంశీ, లైన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఉప్పు ఆంజనేయులు, ట్రస్టు కార్యదర్శి మోగుదాల రమేష్ గౌడ్, కోశాధికారి గోశిక కరుణాకర్, లైన్స్ క్లబ్ అధ్యక్షులు ఎండి అతః పాషా, చౌటుప్పల్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వరావు, డాక్టర్ అవ్వారి శ్రీనివాస ప్రసాద్, డాక్టర్ సుమన్ కళ్యాణ్, డాక్టర్ కాటంరాజు, దాచేపల్లి రాజు గుప్తా, బత్తిని రఘు గౌడ్, బద్దం లింగారెడ్డి, కాసుల వెంకటేశం, వేముల నరసింహ, కొసనం రాంరెడ్డి, కటకం ప్రశాంత్, నాంపల్లి రమేష్, లక్ష్మణ్ గౌడ్, సిలివేరు మంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

టీబీ క్షయ బాధితులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ

Article Image

లయన్స్ క్లబ్, డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత సేవలు

క్షయ (టీబీ) వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడటంతో పాటు శరీరానికి అవసరమైన పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఎంతో ముఖ్యమని యాదాద్రి భువనగిరి జిల్లా డీఎంహెచ్‌ఓ ఎం. మనోహర్ తెలిపారు. చౌటుప్పల్‌లోని సేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దాచేపల్లి ప్రకాష్ గుప్తా అధ్యక్షతన, చౌటుప్పల్ డాక్టర్స్ అసోసియేషన్, బద్దం లింగారెడ్డి సౌజన్యంతో టీబీ బాధితులకు శనివారం పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఎంహెచ్‌ఓ మనోహర్ మాట్లాడుతూ.. నిరుపేద టీబీ రోగుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి పౌష్టికాహారం అందించడం అభినందనీయమన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో పోలియోను ఏ విధంగా నిర్మూలించామో, సమిష్టి కృషి ద్వారా టీబీ రహిత సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆర్గనైజర్ వంశీ, లైన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఉప్పు ఆంజనేయులు, ట్రస్టు కార్యదర్శి మోగుదాల రమేష్ గౌడ్, కోశాధికారి గోశిక కరుణాకర్, లైన్స్ క్లబ్ అధ్యక్షులు ఎండి అతః పాషా, చౌటుప్పల్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వరావు, డాక్టర్ అవ్వారి శ్రీనివాస ప్రసాద్, డాక్టర్ సుమన్ కళ్యాణ్, డాక్టర్ కాటంరాజు, దాచేపల్లి రాజు గుప్తా, బత్తిని రఘు గౌడ్, బద్దం లింగారెడ్డి, కాసుల వెంకటేశం, వేముల నరసింహ, కొసనం రాంరెడ్డి, కటకం ప్రశాంత్, నాంపల్లి రమేష్, లక్ష్మణ్ గౌడ్, సిలివేరు మంగయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News