లయన్స్ క్లబ్, డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత సేవలు
క్షయ (టీబీ) వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడటంతో పాటు శరీరానికి అవసరమైన పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఎంతో ముఖ్యమని యాదాద్రి భువనగిరి జిల్లా డీఎంహెచ్ఓ ఎం. మనోహర్ తెలిపారు. చౌటుప్పల్లోని సేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దాచేపల్లి ప్రకాష్ గుప్తా అధ్యక్షతన, చౌటుప్పల్ డాక్టర్స్ అసోసియేషన్, బద్దం లింగారెడ్డి సౌజన్యంతో టీబీ బాధితులకు శనివారం పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఎంహెచ్ఓ మనోహర్ మాట్లాడుతూ.. నిరుపేద టీబీ రోగుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి పౌష్టికాహారం అందించడం అభినందనీయమన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో పోలియోను ఏ విధంగా నిర్మూలించామో, సమిష్టి కృషి ద్వారా టీబీ రహిత సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆర్గనైజర్ వంశీ, లైన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఉప్పు ఆంజనేయులు, ట్రస్టు కార్యదర్శి మోగుదాల రమేష్ గౌడ్, కోశాధికారి గోశిక కరుణాకర్, లైన్స్ క్లబ్ అధ్యక్షులు ఎండి అతః పాషా, చౌటుప్పల్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వరావు, డాక్టర్ అవ్వారి శ్రీనివాస ప్రసాద్, డాక్టర్ సుమన్ కళ్యాణ్, డాక్టర్ కాటంరాజు, దాచేపల్లి రాజు గుప్తా, బత్తిని రఘు గౌడ్, బద్దం లింగారెడ్డి, కాసుల వెంకటేశం, వేముల నరసింహ, కొసనం రాంరెడ్డి, కటకం ప్రశాంత్, నాంపల్లి రమేష్, లక్ష్మణ్ గౌడ్, సిలివేరు మంగయ్య తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి