Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పేదల పెన్నిధి సురవరం: పల్లె శేఖర్ రెడ్డి మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 22, 2026 07:03 PM

ట్రాక్టర్, గుడిసె ధ్వంసంపై చర్యలు తీసుకోవాలి. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి

ట్రాక్టర్, గుడిసె ధ్వంసంపై చర్యలు తీసుకోవాలి. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి

ట్రాక్టర్, గుడిసె ధ్వంసంపై చర్యలు తీసుకోవాలి. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి
22-08-2026 117 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సిరిపురం: సిరి మెటల్స్‌ ఏర్పాటు పేరుతో భూములను నాశనం చేయొద్దని ప్రశ్నించిన రైతులపై దాడి చేసి, ట్రాక్టర్‌, వ్యవసాయ భూమిలోని గుడిసెను ధ్వంసం చేయడంతోపాటు 10 మంది నిర్దోషులపై అక్రమంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం దారుణమని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి అన్నారు. రైతులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

సిరిపురంలో సిరి మెటల్స్‌ సంస్థ ఏర్పాటు విషయంలో రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ముందుకు వెళ్లడం సరికాదన్నారు. రాజకీయ పలుకుబడితో సంస్థ యాజమాన్యం రైతులపై దౌర్జన్యానికి పాల్పడటం, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా నిర్దోషులపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

రైతు బల్గురి మల్లేష్‌కు చెందిన ట్రాక్టర్‌, వ్యవసాయ భూమిలోని గుడిసె ధ్వంసం చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ట్రాక్టర్‌ ధ్వంసానికి బాధ్యులైన సిరి మెటల్స్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకుని, రైతుకు జరిగిన నష్టానికి తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఘటనపై వాస్తవాలను పరిశీలించి నిర్దోషులపై బనాయించిన కేసులను రద్దు చేయాలని కోరారు.

రైతుల భూములు, జీవనోపాధి, భవిష్యత్తుకు నష్టం కలిగించే చర్యలను సహించేది లేదని అశోక్‌రెడ్డి స్పష్టం చేశారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించకుండా రైతులపై కేసులు, దౌర్జన్యాలు కొనసాగిస్తే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని హెచ్చరించారు. సిరి మెటల్స్‌ ఏర్పాటు అంశంపై సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను కోరారు.

కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బడుగు రమేష్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బల్గురి అంజయ్య, కందుల మల్లారెడ్డి, శాఖ కార్యదర్శి అంబటి మల్లారెడ్డి, నాయకులు కునూరు గణేష్, అంబటి సురేందర్‌రెడ్డి, భారత మృత్యుంజయ, రాపోలు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ట్రాక్టర్, గుడిసె ధ్వంసంపై చర్యలు తీసుకోవాలి. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి

Article Image

సిరిపురం: సిరి మెటల్స్‌ ఏర్పాటు పేరుతో భూములను నాశనం చేయొద్దని ప్రశ్నించిన రైతులపై దాడి చేసి, ట్రాక్టర్‌, వ్యవసాయ భూమిలోని గుడిసెను ధ్వంసం చేయడంతోపాటు 10 మంది నిర్దోషులపై అక్రమంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం దారుణమని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి అన్నారు. రైతులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

సిరిపురంలో సిరి మెటల్స్‌ సంస్థ ఏర్పాటు విషయంలో రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ముందుకు వెళ్లడం సరికాదన్నారు. రాజకీయ పలుకుబడితో సంస్థ యాజమాన్యం రైతులపై దౌర్జన్యానికి పాల్పడటం, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా నిర్దోషులపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

రైతు బల్గురి మల్లేష్‌కు చెందిన ట్రాక్టర్‌, వ్యవసాయ భూమిలోని గుడిసె ధ్వంసం చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ట్రాక్టర్‌ ధ్వంసానికి బాధ్యులైన సిరి మెటల్స్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకుని, రైతుకు జరిగిన నష్టానికి తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఘటనపై వాస్తవాలను పరిశీలించి నిర్దోషులపై బనాయించిన కేసులను రద్దు చేయాలని కోరారు.

రైతుల భూములు, జీవనోపాధి, భవిష్యత్తుకు నష్టం కలిగించే చర్యలను సహించేది లేదని అశోక్‌రెడ్డి స్పష్టం చేశారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించకుండా రైతులపై కేసులు, దౌర్జన్యాలు కొనసాగిస్తే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని హెచ్చరించారు. సిరి మెటల్స్‌ ఏర్పాటు అంశంపై సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను కోరారు.

కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బడుగు రమేష్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బల్గురి అంజయ్య, కందుల మల్లారెడ్డి, శాఖ కార్యదర్శి అంబటి మల్లారెడ్డి, నాయకులు కునూరు గణేష్, అంబటి సురేందర్‌రెడ్డి, భారత మృత్యుంజయ, రాపోలు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News