హైదరాబాద్: తెలంగాణ ఆరాధ్య వనదేవతలు సమ్మక్క–సారలమ్మ వీరగాథ ఆధారంగా భారీ బడ్జెట్తో పాన్ ఇండియా చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ మాస్ట్రో క్రియేషన్స్ సన్నాహాలు చేస్తోంది. నిజ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని రూపొందనున్న ఈ చిత్రం భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, వీరత్వం, భావోద్వేగాలను వెండితెరపై అద్భుతమైన విజువల్ అనుభూతిగా ఆవిష్కరించనుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ.. సినిమాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. విజువల్ ఎఫెక్ట్స్, ప్రీ-విజువలైజేషన్, వర్చువల్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ వంటి కీలక విభాగాల్లో నైపుణ్యం కలిగిన యూకే, అమెరికా తదితర దేశాలకు చెందిన ప్రముఖ స్టూడియోలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.
సమ్మక్క–సారలమ్మ పాత్రలకు ప్రతిష్ఠాత్మక నటీనటులను ఎంపిక చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. రాబోయే సమ్మక్క–సారలమ్మ మహాజాతర సమయానికల్లా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, బడ్జెట్ తదితర పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి