Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రూపా రెడ్డి హత్యకు నిరసనగా కదిలిన విద్యా సమాజం నల్లగొండలో TRSMA ఆధ్వర్యంలో భారీ సంఘీభావ ర్యాలీ.. నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 21, 2026 11:59 PM

బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా రాజీనామా చేయాలి

బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా రాజీనామా చేయాలి

బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా రాజీనామా చేయాలి
21-08-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

ఏకపక్ష, అప్రజాస్వామిక వైఖరికి నిరసనగా నల్లగొండ జిల్లా కోర్టు ఎదుట ఐలు ఆందోళన

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా అనుసరిస్తున్న ఏకపక్ష, అప్రజాస్వామిక, రాజకీయ పక్షపాత వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన వెంటనే బీసీఐ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) నల్లగొండ జిల్లా కార్యదర్శి అనంతుల శంకరయ్య డిమాండ్ చేశారు. బీసీఐ స్వతంత్రత, ప్రజాస్వామిక విలువలు, న్యాయవాదుల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత చైర్మన్‌పై ఉందని ఆయన అన్నారు.

శుక్రవారం నల్లగొండ జిల్లా కోర్టు ఎదుట ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతుల శంకరయ్య మాట్లాడుతూ.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏ రాజకీయ పార్టీకి లేదా ప్రభుత్వానికి అనుబంధ సంస్థ కాదని, దేశంలోని న్యాయవాదులందరికీ ప్రాతినిధ్యం వహించే స్వతంత్ర చట్టబద్ధ సంస్థ అని పేర్కొన్నారు. అలాంటి సంస్థ అధికారిక పదవి, లెటర్‌హెడ్‌ను రాజకీయ ప్రకటనలకు ఉపయోగించడం సంస్థ స్వతంత్రతను, విశ్వసనీయతను దెబ్బతీసే చర్యగా ఆయన విమర్శించారు.

మనన్ కుమార్ మిశ్రా 14 సంవత్సరాలకు పైగా బీసీఐ చైర్మన్‌గా కొనసాగుతూ సంస్థలో అధికారాన్ని వ్యక్తిగతంగా కేంద్రీకరించడం ప్రజాస్వామిక వ్యవస్థకు విరుద్ధమని శంకరయ్య అన్నారు. బార్ కౌన్సిల్ వంటి చట్టబద్ధ సంస్థలో నిర్ణయాలు పారదర్శకంగా, ప్రజాస్వామిక పద్ధతిలో జరగాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవాదుల వృత్తి ప్రయోజనాలు, న్యాయవ్యవస్థ స్వతంత్రత, న్యాయ విద్య ప్రమాణాలను కాపాడటంలో బీసీఐ కీలక పాత్ర పోషించాల్సి ఉందని తెలిపారు.

నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 2026 బ్యాచ్ పట్టభద్రులను న్యాయవాదులుగా నమోదు చేయవద్దని రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు ఆదేశాలు జారీ చేయడం ఏకపక్ష, చట్టవిరుద్ధ చర్యగా ఆయన అభివర్ణించారు. కొంతమంది విద్యార్థులు శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు మొత్తం బ్యాచ్‌ను శిక్షించే విధంగా నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విలువలకు, న్యాయవాదుల చట్టం-1961 నిబంధనలకు విరుద్ధమని అన్నారు. అనంతరం ఆ ఆదేశాలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పినప్పటికీ, విద్యార్థుల వృత్తిపరమైన భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిన బాధ్యత నుంచి చైర్మన్ తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

అదేవిధంగా ప్రజాస్వామికంగా ఎన్నికైన రాష్ట్ర బార్ కౌన్సిళ్ల స్వతంత్రతలో జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులను నామినేషన్ల ద్వారా అధికార స్థానాల్లో నియమించడం, ఎన్నికల ఫలితాల అనంతరం సభ్యుల సంఖ్యను పెంచి ఓడిపోయిన అభ్యర్థులను కౌన్సిళ్లలోకి తీసుకురావడానికి ప్రయత్నించడం ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధమని శంకరయ్య ఆరోపించారు. ఇటువంటి చర్యలు న్యాయవాదులలో బార్ కౌన్సిళ్లపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని అన్నారు.

న్యాయ విద్య ప్రమాణాలు, న్యాయ కళాశాలల తనిఖీలు, అనుమతులు, విరాళాల సేకరణకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలని ఐలు నాయకులు డిమాండ్ చేశారు. బీసీఐలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంతోపాటు సంస్థ ప్రజాస్వామిక, స్వతంత్ర, చట్టబద్ధ స్వభావాన్ని కాపాడాలని కోరారు.

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోల్పోయిన గౌరవం, విశ్వసనీయత, ప్రజాస్వామిక స్వభావాన్ని పునరుద్ధరించేందుకు మనన్ కుమార్ మిశ్రా వెంటనే బీసీఐ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని అనంతుల శంకరయ్య డిమాండ్ చేశారు. న్యాయవాదుల హక్కుల పరిరక్షణ కోసం ఐలు నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

ఈ నిరసన కార్యక్రమంలో ఐలు జిల్లా ఉపాధ్యక్షులు పందెనపల్లి బ్రహ్మచారి, జిల్లా నాయకులు డి. నర్సాజీ, భీమగాని గణేష్, ఎన్. రాములు, పి. శేఖర్, దుర్గాప్రసాద్, మురళీకృష్ణ, నాగరాజు, స్వామినాథ్, సతీష్, నితీష్, రతన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా రాజీనామా చేయాలి

Article Image

ఏకపక్ష, అప్రజాస్వామిక వైఖరికి నిరసనగా నల్లగొండ జిల్లా కోర్టు ఎదుట ఐలు ఆందోళన

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా అనుసరిస్తున్న ఏకపక్ష, అప్రజాస్వామిక, రాజకీయ పక్షపాత వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన వెంటనే బీసీఐ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) నల్లగొండ జిల్లా కార్యదర్శి అనంతుల శంకరయ్య డిమాండ్ చేశారు. బీసీఐ స్వతంత్రత, ప్రజాస్వామిక విలువలు, న్యాయవాదుల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత చైర్మన్‌పై ఉందని ఆయన అన్నారు.

శుక్రవారం నల్లగొండ జిల్లా కోర్టు ఎదుట ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతుల శంకరయ్య మాట్లాడుతూ.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏ రాజకీయ పార్టీకి లేదా ప్రభుత్వానికి అనుబంధ సంస్థ కాదని, దేశంలోని న్యాయవాదులందరికీ ప్రాతినిధ్యం వహించే స్వతంత్ర చట్టబద్ధ సంస్థ అని పేర్కొన్నారు. అలాంటి సంస్థ అధికారిక పదవి, లెటర్‌హెడ్‌ను రాజకీయ ప్రకటనలకు ఉపయోగించడం సంస్థ స్వతంత్రతను, విశ్వసనీయతను దెబ్బతీసే చర్యగా ఆయన విమర్శించారు.

మనన్ కుమార్ మిశ్రా 14 సంవత్సరాలకు పైగా బీసీఐ చైర్మన్‌గా కొనసాగుతూ సంస్థలో అధికారాన్ని వ్యక్తిగతంగా కేంద్రీకరించడం ప్రజాస్వామిక వ్యవస్థకు విరుద్ధమని శంకరయ్య అన్నారు. బార్ కౌన్సిల్ వంటి చట్టబద్ధ సంస్థలో నిర్ణయాలు పారదర్శకంగా, ప్రజాస్వామిక పద్ధతిలో జరగాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవాదుల వృత్తి ప్రయోజనాలు, న్యాయవ్యవస్థ స్వతంత్రత, న్యాయ విద్య ప్రమాణాలను కాపాడటంలో బీసీఐ కీలక పాత్ర పోషించాల్సి ఉందని తెలిపారు.

నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 2026 బ్యాచ్ పట్టభద్రులను న్యాయవాదులుగా నమోదు చేయవద్దని రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు ఆదేశాలు జారీ చేయడం ఏకపక్ష, చట్టవిరుద్ధ చర్యగా ఆయన అభివర్ణించారు. కొంతమంది విద్యార్థులు శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు మొత్తం బ్యాచ్‌ను శిక్షించే విధంగా నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విలువలకు, న్యాయవాదుల చట్టం-1961 నిబంధనలకు విరుద్ధమని అన్నారు. అనంతరం ఆ ఆదేశాలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పినప్పటికీ, విద్యార్థుల వృత్తిపరమైన భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిన బాధ్యత నుంచి చైర్మన్ తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

అదేవిధంగా ప్రజాస్వామికంగా ఎన్నికైన రాష్ట్ర బార్ కౌన్సిళ్ల స్వతంత్రతలో జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులను నామినేషన్ల ద్వారా అధికార స్థానాల్లో నియమించడం, ఎన్నికల ఫలితాల అనంతరం సభ్యుల సంఖ్యను పెంచి ఓడిపోయిన అభ్యర్థులను కౌన్సిళ్లలోకి తీసుకురావడానికి ప్రయత్నించడం ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధమని శంకరయ్య ఆరోపించారు. ఇటువంటి చర్యలు న్యాయవాదులలో బార్ కౌన్సిళ్లపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని అన్నారు.

న్యాయ విద్య ప్రమాణాలు, న్యాయ కళాశాలల తనిఖీలు, అనుమతులు, విరాళాల సేకరణకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలని ఐలు నాయకులు డిమాండ్ చేశారు. బీసీఐలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంతోపాటు సంస్థ ప్రజాస్వామిక, స్వతంత్ర, చట్టబద్ధ స్వభావాన్ని కాపాడాలని కోరారు.

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోల్పోయిన గౌరవం, విశ్వసనీయత, ప్రజాస్వామిక స్వభావాన్ని పునరుద్ధరించేందుకు మనన్ కుమార్ మిశ్రా వెంటనే బీసీఐ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని అనంతుల శంకరయ్య డిమాండ్ చేశారు. న్యాయవాదుల హక్కుల పరిరక్షణ కోసం ఐలు నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

ఈ నిరసన కార్యక్రమంలో ఐలు జిల్లా ఉపాధ్యక్షులు పందెనపల్లి బ్రహ్మచారి, జిల్లా నాయకులు డి. నర్సాజీ, భీమగాని గణేష్, ఎన్. రాములు, పి. శేఖర్, దుర్గాప్రసాద్, మురళీకృష్ణ, నాగరాజు, స్వామినాథ్, సతీష్, నితీష్, రతన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News