Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రూపా రెడ్డి హత్యకు నిరసనగా కదిలిన విద్యా సమాజం నల్లగొండలో TRSMA ఆధ్వర్యంలో భారీ సంఘీభావ ర్యాలీ.. నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 21, 2026 11:57 PM

సాగర్ నీళ్లు తెలంగాణ రైతుల హక్కు.. వెంటనే విడుదల చేయాలి

సాగర్ నీళ్లు తెలంగాణ రైతుల హక్కు.. వెంటనే విడుదల చేయాలి

సాగర్ నీళ్లు తెలంగాణ రైతుల హక్కు.. వెంటనే విడుదల చేయాలి
21-08-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

నీటి తరలింపును అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలం.. మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఆగ్రహం

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి లభ్యత ఉన్నప్పటికీ తెలంగాణ ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేయకపోవడంపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు సాగర్ నీటిని తరలించుకుపోతున్నా రాష్ట్ర మంత్రులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. సాగర్ ఆయకట్టు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం వెంటనే నివారించాలని డిమాండ్ చేశారు.

సాగర్ నీటి పరిస్థితిపై ఆయన మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించుకుపోతున్నప్పటికీ తెలంగాణ ప్రాంత రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. సాగర్ జలాశయంలో నీళ్లు ఉన్నప్పుడు ఎడమ కాల్వకు నీటిని ఎందుకు విడుదల చేయడం లేదో జిల్లా మంత్రులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాగర్ ఆయకట్టుకు వరుసగా 17 సార్లు సాగునీటిని అందించామని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. అప్పట్లో రైతులకు సాగునీటి విషయంలో భరోసా కల్పించామని, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం రైతుల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సాగర్ ఆయకట్టు పరిధిలోని వేలాది మంది రైతులు నీటి కోసం ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.

సాగర్ ఎడమ కాల్వతో పాటు ఆయకట్టు పరిధిలోని లిఫ్ట్‌లకు కూడా వెంటనే నీటిని విడుదల చేయాలని జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు. నీటిని విడుదల చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, పంటల సాగు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరారు.

తెలంగాణ రైతుల హక్కుగా ఉన్న సాగర్ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించుకుపోతున్నా ప్రభుత్వం మౌనంగా ఉండటం సరికాదని ఆయన అన్నారు. నీటి విషయంలో రైతులు ప్రభుత్వాన్ని నిలదీయాలని, తమ హక్కైన సాగునీటిని సాధించుకోవడానికి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

సాగర్ నీటిని విడుదల చేయడంలో ప్రభుత్వం ఇంకా జాప్యం చేస్తే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని జగదీష్‌రెడ్డి హెచ్చరించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

“సాగర్ నీళ్లు తెలంగాణ రైతుల హక్కు.. నీళ్లు ఇచ్చి తీరాలి” అని జగదీష్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Sthanikam

సాగర్ నీళ్లు తెలంగాణ రైతుల హక్కు.. వెంటనే విడుదల చేయాలి

Article Image

నీటి తరలింపును అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలం.. మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఆగ్రహం

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి లభ్యత ఉన్నప్పటికీ తెలంగాణ ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేయకపోవడంపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు సాగర్ నీటిని తరలించుకుపోతున్నా రాష్ట్ర మంత్రులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. సాగర్ ఆయకట్టు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం వెంటనే నివారించాలని డిమాండ్ చేశారు.

సాగర్ నీటి పరిస్థితిపై ఆయన మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించుకుపోతున్నప్పటికీ తెలంగాణ ప్రాంత రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. సాగర్ జలాశయంలో నీళ్లు ఉన్నప్పుడు ఎడమ కాల్వకు నీటిని ఎందుకు విడుదల చేయడం లేదో జిల్లా మంత్రులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాగర్ ఆయకట్టుకు వరుసగా 17 సార్లు సాగునీటిని అందించామని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. అప్పట్లో రైతులకు సాగునీటి విషయంలో భరోసా కల్పించామని, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం రైతుల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సాగర్ ఆయకట్టు పరిధిలోని వేలాది మంది రైతులు నీటి కోసం ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.

సాగర్ ఎడమ కాల్వతో పాటు ఆయకట్టు పరిధిలోని లిఫ్ట్‌లకు కూడా వెంటనే నీటిని విడుదల చేయాలని జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు. నీటిని విడుదల చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, పంటల సాగు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరారు.

తెలంగాణ రైతుల హక్కుగా ఉన్న సాగర్ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించుకుపోతున్నా ప్రభుత్వం మౌనంగా ఉండటం సరికాదని ఆయన అన్నారు. నీటి విషయంలో రైతులు ప్రభుత్వాన్ని నిలదీయాలని, తమ హక్కైన సాగునీటిని సాధించుకోవడానికి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

సాగర్ నీటిని విడుదల చేయడంలో ప్రభుత్వం ఇంకా జాప్యం చేస్తే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని జగదీష్‌రెడ్డి హెచ్చరించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

“సాగర్ నీళ్లు తెలంగాణ రైతుల హక్కు.. నీళ్లు ఇచ్చి తీరాలి” అని జగదీష్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News