నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ బాల నరసింహ స్వామి దేవాలయ టర్నింగ్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు లారీ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికుల వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా నీర్నాముల గ్రామానికి చెందిన ముత్యాల శివ (34) చిట్యాల నుంచి భువనగిరి వైపు వెళ్తున్నాడు. బాల నరసింహ స్వామి దేవాలయ టర్నింగ్ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన కారు అతని వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలిపారు. దీంతో అదుపుతప్పిన శివ ఎదురుగా వస్తున్న లారీ కింద పడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు.
సమాచారం అందుకున్న చిట్యాల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే చర్యలు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి