Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెనుక నుంచి కారు ఢీ.. లారీ కిందపడి యువకుడు మృతి పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 09, 2026 02:22 PM

వెనుక నుంచి కారు ఢీ.. లారీ కిందపడి యువకుడు మృతి

వెనుక నుంచి కారు ఢీ.. లారీ కిందపడి యువకుడు మృతి

వెనుక నుంచి కారు ఢీ.. లారీ కిందపడి యువకుడు మృతి
09-08-2026 339 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ బాల నరసింహ స్వామి దేవాలయ టర్నింగ్‌ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు లారీ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికుల వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా నీర్నాముల గ్రామానికి చెందిన ముత్యాల శివ (34) చిట్యాల నుంచి భువనగిరి వైపు వెళ్తున్నాడు. బాల నరసింహ స్వామి దేవాలయ టర్నింగ్‌ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన కారు అతని వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలిపారు. దీంతో అదుపుతప్పిన శివ ఎదురుగా వస్తున్న లారీ కింద పడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు.

సమాచారం అందుకున్న చిట్యాల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే చర్యలు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

Sthanikam

వెనుక నుంచి కారు ఢీ.. లారీ కిందపడి యువకుడు మృతి

Article Image


నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ బాల నరసింహ స్వామి దేవాలయ టర్నింగ్‌ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు లారీ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికుల వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా నీర్నాముల గ్రామానికి చెందిన ముత్యాల శివ (34) చిట్యాల నుంచి భువనగిరి వైపు వెళ్తున్నాడు. బాల నరసింహ స్వామి దేవాలయ టర్నింగ్‌ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన కారు అతని వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలిపారు. దీంతో అదుపుతప్పిన శివ ఎదురుగా వస్తున్న లారీ కింద పడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు.

సమాచారం అందుకున్న చిట్యాల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే చర్యలు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News